టీడీపీ నుంచి రెండు రోజుల కిందటే పార్టీ మారి.. జనసేన తీర్థం పుచ్చుకున్న సీనియర్ నాయకుడు, మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ టికెట్ కేటాయించారు. వాస్తవానికి ఇక్కడ జనసేనకు విక్కుర్తి వేణుగోపాల్ సహా మరో ఇద్దరు కీలక నాయకులు ఉన్నారు. అయితే.. వీరిలో ఒకరిని ఎంపిక చేస్తామని ఆది నుంచి చెబుతూ వచ్చిన పవన్.. చివరకు టీడీపీ నుంచి మండలిని తీసుకుని.. ఆయనకు తాజాగా టికెట్ ప్రకటించారు.
అయితే.. ఈ ప్రయోగాలు జనసేనలో ఇటీవల కామన్ అయ్యాయి. టీడీపీ నుంచి అప్పటికప్పుడు జనసేనలో చేర్చుకున్న పులపర్తి రామాంజనేయులుకు భీమవరం టికెట్ ఇచ్చారు. అసలు ఏ పార్టీలోనూ లేని.. కొణతా ల రామకృష్ణకు అనకాపల్లి టికెట్ కేటాయించారు. వైసీపీ నుంచి ఎన్నికల షెడ్యూల్ తర్వాత వచ్చిన చేరిన ఆరణి శ్రీనివాసులుకు.. తిరుపతి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. దీంతో జనసేన శ్రేణులు రగిలిపోతున్నాయి. తీసుకున్నది 21 సీట్లు. అవి కూడా జనసేనలో కష్టపడి పనిచేసినవారికి ఇవ్వకుండా ఇలా చేయడం ఏంటనేదివారి ప్రశ్న.
అయితే.. తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్… తనను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదన్నది జనసేన అధినే త మాట. దీంతో ఎక్కడికక్కడ అంతర్గత కుమ్ములాటలతో జనసేన కునారిల్లిపోతుండడం గమనార్హం. అభ్య ర్థుల్లో సత్తా ఉంటే గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే.. కేడర్పై మాత్రం ఆధారపడ్డారా.. ఎక్కడా వారి సహ కారం మచ్చుకు కూడా కనిపించడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన గురించి ఏ ఇద్దరు మాట్లాడుకు న్నా.. అది కూడా టీడీపీనే! అనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
నిజానికి ఒక పార్టీ నుంచి అభ్యర్థి పార్టీ ని వదిలేయడానికి అర్ధం ఉంది. కానీ.. పొత్తులో ఉన్న టీడీపీ నుంచి నాయకులను తీసుకుని, వారికే టికెట్లు ఇస్తే.. ఇప్పటి వరకు పార్టీ జెండాలు మోసిన వారు.. ఖర్చె పెట్టిన వారు.. పవన్ కోసం.. వీరాభిమానం ప్రదర్శించిన వారు ఏం కావాలి? రేపు వీరిలో ఎవరైనా ఓడిపోతే.. మళ్లీ పవన్కు జై కొడతారా? కనీసం పవన్ మొహం కూడా చూస్తారనే గ్యారెంటీ లేదు. అంతిమంగా పవన్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.. ప్రజా కోర్టులో ఏమేరకు విజయం దక్కించుకుంటాయో చూడాలి.