(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఏపి రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కార్యాలయానికి అమరావతి రైతులు తరలివచ్చారు. గుంటూరు జిల్లా నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులతో చర్చించి వారికి అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజధానిపై జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ తమ వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత ఉందని పవన్ అన్నారు. రాజధానిపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.