(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
గుంటూరు: అమరావతి పోరాటాన్ని ప్రభుత్వం పోలీసులతో అణచివేయాలని చూస్తోందనీ, గతంలో ఇలా చేసిన వారు చరిత్రలో కలిసిపోయారనే విషయం తెలుసుకోవాలనీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం రాజధాని ప్రాంత రైతులు, అమరావతి పరిరక్షణ సమితి జెఏసి నేతలు కన్నాను కలిసి అమరావతి పోరాటం, పోలీసు నిర్బంధంపై వివరించారు. పోరాటానికి కన్నా మద్దతు కోరారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆందోళనలు చేశారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వైఖరి ఆయన వైఖరి మారిందని విమర్శించారు. ప్యాక్షనిస్టు నుంచి ముఖ్యమంత్రి అయ్యాక కూడా అలాగే ఉంటానంటే ఎలా అని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
మహిళల ఆందోళనలను గౌరవించాలని అని అన్నారు.ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు.దీనివల్ల ఏపీ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని సొంత సొమ్ముగా వాడే సంస్కృతి మంచిది కాదని కన్నా అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నియంతృత్వ పోకడలు విడనాడాలని ఆయన సూచించారు.రాజధాని విషయంలో బిజెపి చివరి వరకూ పోరాడుతుందని చెప్పారు. అవసరమైతే ప్రధాని దృష్టికి కూడా సమస్యను తీసుకువెళతామని కన్నా వారికి హామీ ఇచ్చారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?