Janasena: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి రేపు (గురువారం) నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జసనేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆ పార్టీ అభ్యర్ధులకు ఇవేళ బీఫామ్ లు అందజేశారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 21 అసెంబ్లీ, ఇద్దరు లోక్ సభ అభ్యర్ధులతో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత నాదెండ్ల మనోహర్ కు బీఫామ్ అందజేసిన పవన్ కళ్యాణ్ .. తర్వాత ఇతర నియోజకవర్గాల అభ్యర్ధులకు బిఫామ్ లు అందించారు.
టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ..అభ్యర్ధులకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
విద్య, ఉపాధి అవకాశాలు, అభివృద్ధికి కంకణబద్దులై పని చేస్తామన్నారు. వలసలు లేని, పస్తులు లేని వికసిత ఏపీ ఏర్పాటు మన అందరి బాధ్యత అని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గెలుపునకు చిత్తశుద్దితో కృషి చేస్తామన్నారు. అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టేందుకు అందరూ కలిసి పని చేయాలన్నారు. వివాదాలకు తావులేకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.
Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం