కేంద్రంతో పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గత కొంతకాలంగా కేంద్రంపై రుసరుసలాడుతున కేసీఆర్ శుక్రవారం బహిరంగంగానే తన వైఖరిని బయట పెట్టారు. పార్లమెంటు సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో టిఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశమై పార్టీ అవలంబించాల్సిన వ్యూహం మీద చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.కేంద్రం తీరుపై సహనం నశించిందని.. ఇక నుంచి రాష్ట్రానికి రావాల్సినవి పోరాడి సాధించుకుందామని కెసిఆర్ పార్టీ ఎంపీలకు ఉద్బోధించారు.
చివరకు రాష్ట్రానికి కేటాయించిన యూరియాను కూడా పూర్తిగా ఇవ్వడం లేదని కెసిఆర్ కృష్ణాజలాల వివాదాన్ని కేంద్రం పరిష్కరించడం లేదని ఈ కారణంగా కృష్ణా బేసిన్లో ఉండే రాష్ట్రాలు అన్ని ఇబ్బందులు పడుతున్నాయని కెసిఆర్ పేర్కొన్నారు.రాష్ట్రానికి ఇరవై రెండు నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్రం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.జాతీయ రహదారుల విషయంలోనూ కేంద్రం మాట మీద నిలబడటం లేదని,కనీసం మరమ్మతులు కూడా నిధులు ఇవ్వడం లేదని కెసిఆర్ చెప్పారు.
వరంగల్ చేనేత పార్క్ కు ఒక్క రూపాయి కూడా కేంద్రం సాయం చేయలేదని,రాష్ట్రంలో ఎనిమిది ఎయిర్ స్ట్రిప్ లు నిర్మించుకుంటామ౦ టే కేంద్రం అనుమతివ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయాలని కెసిఆర్ ఎంపీలకు డైరెక్షన్ ఇచ్చారు. జిఎస్టి బకాయిలపై సభ వెలుపల కూడా ఆందోళనలు నిర్వహించాలని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయాలని కెసిఆర్ నిర్దేశించారు.
కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యుత్ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలని టిఆర్ఎస్టిఆర్ఎస్ నిర్ణయించింది..పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని కెసిఆర్ సూచనల మేరకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది.మొత్తంమీద కెసిఆర్ వైఖరి సమయం మించిపోతోంది ఇక మిగిలింది సమరమే అన్నట్లుగా ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవచ్చునని వారు చెబుతున్నారు