విభజన జరిగిన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తరుణంలో రాజధానిగా అమరావతి ని గుర్తించటం అందరికీ తెలిసిందే. దాదాపు ఏపీ రాజధాని కోసం కొన్ని వేల ఎకరాలు రైతుల దగ్గర నుండి టిడిపి పార్టీ తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ వైసీపీ మొదటి నుండి ఆరోపిస్తూనే ఉంది.
అంత మాత్రమే కాక అమరావతి ని రాజధాని గా గుర్తించడం వెనకాల అసలు ఉద్దేశం కొన్ని వర్గాలకు మేలు చేకూర్చడం అని కూడా వైసీపీ మొదటి నుండి ఆరోపిస్తూ ఉంది. 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న కీలకమైన నిర్ణయాలు మూడు రాజధానుల నిర్ణయం ఒకటి. అభివృద్ధి అన్నది ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదని, మూడు చోట్ల అభివృద్ధి జరిగితే భవిష్యత్తులో ప్రాంతాలు విడిపోకుండా ఉంటాయని కలిసికట్టుగా ఉండటం జరుగుతుందని హైదరాబాద్ పట్టణం పోగొట్టుకోవటం తో పడిన ఆర్థిక దెబ్బ మళ్లీ భవిష్యత్తులో తగలకూడదు అనే ఉద్దేశంతో జగన్ మూడు రాజధానులు నిర్ణయం తెర పైకి తీసుకు రావడం జరిగింది.
అయితే ఈ క్రమంలో కొన్ని ప్రతిపక్ష పార్టీలు అమరావతిని రాజధానిగా ఉంచాలని కామెంట్లు చేస్తున్నా తరుణంలో మూడు రాజధానులు ఏర్పాటు కాకపోయినా చాలావరకు ఈ నిర్ణయంతో జగన్ రాజకీయంగా మైలేజ్ సంపాదించినట్లే అని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానులు ఏర్పాటు కాకపోతే.. న్యాయస్థానాలు లేదా ఇంకా ఏ పరంగా అయినా అడ్డుపడితే ఎటు చూసినా జగన్ కి అడ్వాంటేజ్ అని చెప్పుకొస్తున్నారు. ఒక అమరావతి రాజధాని ప్రాంతంలో మినహా మిగతా చోట్ల వైసిపి హవా నడుస్తుందని టీడీపీ పూర్తిగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అభివృద్ధిలో వెనుకబడిపోయిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నట్లు అవుతుందని పేర్కొంటున్నారు.