Acharya: ప్రముఖ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం `ఆచార్య`. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. మణిశర్మ స్వరాలు అందించారు.
భారీ అంచనాల నడుమ నిన్న అట్టహాసంగా విడుదలైన ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం.. తొలి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. కథ, కథనంలో ఏ మాత్రం కొత్తదనం లేదని మెగా అభిమానులే పెదవి విరిచారు. అయితే టాక్ ఎలా ఉన్నప్పటికీ.. ఈ చిత్రం తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తెలుగులో రాష్ట్రాల్లోనే మొదటి రోజు రూ. 29.50 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్గా రూ. 35.05 కోట్ల రేంజ్లో షేర్ కొల్లగొట్టింది. కానీ, రెండో రోజు మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఘోరంగా పడిపోయాయి. రెండో రోజు ఈ సినిమా కేవలం రూ. 5.15 కోట్లు మాత్రమే వసూల్ చేయగలిగింది. ఇక ఏరియాల వారీగా ఆచార్య 2 డేస్ టోటల్ కలెక్షన్స్ను ఓ సారి గమనిస్తే..
నైజాం : 10.10 కోట్లు
సీడెడ్ : 5.23 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.24 కోట్లు
ఈస్ట్ : 2.86 కోట్లు
వెస్ట్ : 3.08 కోట్లు
గుంటూరు : 4.26 కోట్లు
కృష్ణ : 2.33 కోట్లు
నెల్లూరు : 2.55 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ=34.65 కోట్లు(48.85 కోట్లు~గ్రాస్)
———————-
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 2.22 కోట్లు
ఓవర్సీస్ : 4.20 కోట్లు
———————–
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్=41.07 కోట్లు(62.85కోట్లు~గ్రాస్)
———————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 131.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య సినిమా రూ.132.50 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొదటి రెండు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా.. ఇంకా రూ. 91.43 కోట్ల రేంజ్ లో షేర్ వసూల్ చేయాల్సి ఉంటుంది.