బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. బోయపాటి గత సినిమాల్లో నటించిన కేథరిన్.. బాలయ్య సరసన చేయబోతుందట. సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు ఇండస్ట్రీ టాక్. జయ జానకీ నాయక, సరైనోడు సినిమాల్లో కనువిందు చేసిన ఈ అమ్మడు.. ఈ సారి నందమూరి నటసింహంతో జోడీ కడుతోంది.
70 కోట్ల అంచనాలతో రూపొందతున్న ఈ ప్రాజెక్టుపై అప్పుడే ఇండస్ట్రీలో హడావుడి మొదలైంది. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తరువాత ముచ్చటగా మూడో సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతకాగా.. మరిన్ని వివరాలు త్వరలో వెలువడున్నాయి.