Balakrishna Rashmika Mandana: నటసింహం నందమూరి బాలయ్య బాబు..హోస్ట్ గా ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో “అన్ స్టాపబుల్” అనే టాకీ షో.. చాలా ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం సీజన్ 3 కొనసాగుతుంది. మొదటి సీజన్ లో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు. రెండో సీజన్ లో సినిమా ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ప్రస్తుతం మూడో సీజన్ లో ఇప్పటివరకు రెండు ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. మొదటి దానిలో “భగవంత్ కేసరి” సినిమా యూనిట్ రావడం జరిగింది. రెండో ఎపిసోడ్ లో యానిమల్ సినిమా యూనిట్ సభ్యులు వచ్చారు.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో పాటు హీరో రణబీర్ కపూర్.. హీరోయిన్ రష్మిక మందన షోకి రావటం జరిగింది. షోలో భాగంగా రష్మిక మందననీ.. విజయ్ దేవరకొండ విషయంలో బాలయ్య బాబు అడ్డంగా బుక్ చేసేసారు. మేటర్ లోకి వెళ్తే “అర్జున్ రెడ్డి” అదేవిధంగా యానిమల్ రెండు పోస్టర్లు పక్క పక్కన పెట్టి.. ప్రశ్నలు వేయడంతో “అర్జున్ రెడ్డి” తో కనెక్షన్ అని రష్మిక మందన నోరు జారింది. దీంతో వెంటనే ఏంటి ఆ కనెక్షన్ అని బాలయ్య బాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి ఒక్కసారిగా రష్మిక మందన సమాధానమివ్వడానికి ఉక్కిరిబిక్కిరి అయింది. అయితే చాలా కవర్ చేసుకుంటూ హైదరాబాద్ వచ్చాక మొట్టమొదటిసారి చూసిన సినిమా “అర్జున్ రెడ్డి” అని రష్మిక ఆ రకంగా సమాధానం ఇచ్చింది.
ఇక ఇదే సమయంలో “అర్జున్ రెడ్డి” ఇంకా “యానిమల్” తన సినిమా కాబట్టి.. రెండు సినిమాలు అంటే తనకిష్టమని రష్మిక స్పష్టం చేసింది. పక్కనే ఉన్నారని రణబీర్ కపూర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి.. మొట్టమొదటిసారి విజయ్ దేవరకొండ ఇంటిపైన అర్జున్ రెడ్డి సక్సెస్ పార్టీలో కలిసినట్లు తెలియజేశారు. ఈ పర్సనల్ విషయాలన్నీ మీకు ఎలాగా తెలుసు అంటూ అది నా వ్యక్తిగతం అని.. రష్మిక సమాధానం ఇచ్చింది. దీంతో బాలయ్య బాబు ఎవరు నిన్ను ఆహ్వానించారు..? ఎవరు విజయ్ దేవరకొండ ఇంటికి నిన్ను పిలిచారు అంటూ బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నలు వేయడంతో రష్మిక.. అదంతా వ్యక్తిగతం అంటూ కామెడీ చేస్తూ ప్రశ్నల నుండి తప్పించుకుంది.