సినీ తెరపై తమ హీరోలను అందంగా చూడడానికే ఇష్టపడే అభిమానులకు ఇది కాస్తా ఇబ్బంది కరమైన వార్తా అయినా…, ప్రయోగాలు లేక మూసగా పోతున్న తెలుగు సినిమా అభిమానులకు మాత్రం ఇది ఆత్రం కలిగించే వార్తే. తెలుగు నాట ఇద్దరు హీరోలు అఘోరాలుగా దర్శనమివ్వనున్నారు. టాప్ హీరో నందమూరి బాలయ్యతో పాటూ.., మంచు మనోజ్ కూడా తన తదుపరి సినిమాలో అఘోరాగా కనిపించనున్నాడు.
మనోజ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత…!
మంచు మనోజ్ కి ప్రతిభ విషయంలో వంకలు లేవు. ఫీట్లు, ఫైట్లుతో మంచి ప్రతిభ కనబర్చాడు. కానీ లక్ అతనికి లాక్ తెరవడం లేదు. సరైన హిట్ లేక చాల కాలం వేచి చూసాడు. చేసేదేం లేక చివరికి సినీ ప్రయాణానికి కొన్నాళ్ళు విరామం ప్రకటించాడు. 2017 లో గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మూడేళ్ళ బ్రేకప్ తీసుకుని ఇప్పుడు మేకప్ వేసుకోనున్నాడు ఈ యువ హీరో. అది కూడా సదా సీదాగా కాదు, అఘోరాగా కనిపించనున్నాడు. తన రానున్న సినిమా అహం భ్రహ్మస్మి లో ఈ గెటప్ ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన పోస్టర్ ని ఆయన ట్విట్టర్ బాటలో పంచుకున్నారు. “ఐ మిస్డ్ మై ఆర్ట్. విచ్ ఈజ్ మై లైఫ్. సినీ అమ్మ, వచ్చేసా” అంటూ ట్వీట్ చేశారు. రానున్న సినిమాలో ఆయన గంటకు పైగా అఘోరాగా కనిపించనున్నారు.
బోయపాటి సినిమాలో బాలయ్య…!
ఇక బాలకృష్ణ తదుపరి సినిమా బోయపాటితో ఉంటుందని అందరికీ తెలిసినదే. ఈ సినిమాలో బాలకృష్ణ గెటప్లు భిన్నంగా ఉంటాయి. దీనిలో బాలయ్య 20 నిమిషాల పాటు అఘోరాగా కనిపించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అసలే మాస్ నాడిపట్టిన బోయపాటి, బాలయ్యల కాంబినేషన్ అంటే అభిమానులకు భారీ ఆశలు ఉంటాయి. వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ కొట్టి నందమూరి హీరో హిట్ ఆకలి తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలకృష్ణకి గెటప్పులు వేయడం ఇది కొత్తకాదు. గతంలోనే భైరవద్వీపంలో అందవిహీనంగా ముసలి గెటప్ లో 15 నిమిషాల కనిపించారు. రెండు దశాబ్దాల కిందట విడుదలైన సుల్తాన్ లో కూడా బాలయ్య పలు గెటప్పుల్లో కనిపించారు. ఇక అఘోరాగానూ అలరిస్తారని అభిమానులు ఆశతో ఉన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!