రిలీజ్ కి ముందే మహానటి సినిమా అంతటి క్రేజ్ నెలకొన్న సినిమా పెంగ్విన్. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైం లో రిలీజైంది. ప్రముఖ కోలీవుడ్ దర్శక నిర్మాత కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ సినిమాకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని ఒక ప్రయోగాత్మకంగా రూపొందించడం విశేషం. మొదటిసారి కీర్తి సురేష్ ప్రగ్నెంట్ లేడీగా చేసిన ప్రయత్నం విజయవంతం అయినప్పటికి అదే ఇప్పుడు కీర్తి కెరీర్ కి మైనస్ అవుతుందన్న టాక్ మొదలైంది.
కేవలం 35 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి గత నెల రోజులుగా అటు తమిళ ఇండస్ట్రీలో ఇటు తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన బజ్ క్రియోట్ అయింది. దానికి తోడు సినిమా రిలీజ్ కి 15 రోజుల ముందు నుంచి ప్రమోషన్స్ బాగా ఊపందుకున్నాయి. టీజర్ ని స్టార్ హీరోయిన్స్ సమంత, త్రిష, తాప్సీ, మంజు వారియర్ రిలీజ్ చేసి పెంగ్విన్ సినిమాకి హైప్ తీసుకు వచ్చారు.
అలాగే ట్రైలర్ ని నేచురల్ స్టార్ నాని తో పాటు మరికొంతమంది స్టార్ హీరోలు రిలీజ్ చేసి బాగా అంచనాలు పెంచారు. అయితే ఆ అంచనాలే ఇప్పుడు కీర్తి సురేష్ కొంప ముంచిందని అంటున్నారు. ఈ సినిమా రిలీజయ్యాక డివైడ్ టాక్ వచ్చి ఒక్కసారిగా క్రేజ్ మొత్తం పడిపోయింది. నిర్మాత సేఫ్ గా పెట్టిన పెట్టుబడి వచ్చినప్పటికి డివైడ్ టాక్ తో కీర్తి సురేష్ కి తర్వాత ప్రాజెక్ట్ మీద ప్రభావం పడిందని అంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం అండర్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాల మీద ఈ ప్రభావం ఎంతో కొంత ఉంటుందన్న టాక్ నడుస్తోంది.