NTR-Sai Pallavi: లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి బిగ్ హిట్స్ను ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి.. గత కొంత కాలం నుంచీ కొత్త ప్రాజెక్ట్స్ ను ఏమీ ప్రకటించలేదు. కానీ, తాజాగా ఈ బ్యూటీని ఓ బంపర్ ఆఫర్ వరించిందట. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించాడు.
కల్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో పాన్ ఇండియా లెవల్లో నిర్మించబోతున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ కు జోడీగా ఏ హీరోయిన్ నటించబోతోందనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో అలియా భట్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ భామల పేర్లు వినిపించారు. కానీ, వారెవ్వరూ ఫైనల్ కాలేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ సాయి పల్లవికి ఓటేశారట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా సాయి పల్లవి నటించబోతోందని, ఇప్పటికే సంప్రదింపులు పూర్తి అయ్యాయని అంటున్నారు.
అంతేకాదు, త్వరలోనే ఈ విషయంపై బిగ్ అనౌన్స్మెంట్ కూడా రానుందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమైతే అభిమానులు ఫుల్ ఖుషీ అవ్వడం ఖాయం. ఎందుకంటే, ఎన్టీఆర్-సాయి పల్లవిలిద్దరూ మంచి డ్యాన్సర్లు. మరియు తమ సహజ నటనతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేసే సత్తా ఈ ఇద్దరిలోనూ సమపాలంలో ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ జోడీ కడితే.. ఇక బాక్సాఫీస్లు బద్దలవడం ఖాయమని అంటున్నారు.