SVP: “సరిలేరు నీకెవ్వరు” లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత “గీతా గోవిందం” డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది మే నెలలో ఈ సినిమా ప్రకటించిన తర్వాత .. అదే ఏడాది చివరిలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. కరోనా కారణంగా దుబాయ్ దేశంలో మొదటి షెడ్యూల్ దాదాపు రెండు నెలలు శరవేగంగా జరుగుతోంది .. రెండో షెడ్యూల్ ఇండియాలో ప్లాన్ చేశారు.
అయితే ఈ సమయంలో ఒక్కసారిగా ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్తత పెరిగిపోవడంతో పరిస్థితులు మొత్తం తలకిందులు కావటం తో .. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో షూటింగులు ఆగిపోయాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దాదాపు నెల రోజులకు పైనుండి షూటింగ్ లు ఆగిపోవటం జరిగింది. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే ప్రస్తుతం దేశంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పగడ్బందీగా “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యింది.
Read More: Mahesh : మహేష్, రాజమౌళిల పాన్ ఇండియన్ సినిమా 2023లోనే..?
మేటర్ లోకి వెళ్తే జూలై మాసం చివరి వారంలో ఏకధాటిగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ డిసైడయ్యారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ టైమ్ లో సెట్ లో పనిచేసే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని లేకపోతే .. సెట్ కీ రాకూడదు అన్న రీతిలో తాజాగా సినిమా యూనిట్ సరికొత్త రూల్స్ పాస్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!