Trinayani February 21 2024 Episode 1169:సుమన ప్రాణగండం నుంచి తప్పించుకుంది కానీ రేపు ఇంకొకరి ప్రాణం పోతుంది అni గురువుగారు చెబుతారు. ఎవరికో తెలుసా నైని అనిదురంధర అంటుంది. నాకు తెలియట్లేదు పిన్ని అని నైని అంటుంది. మా అక్క చెప్పలేకపోతుందని చెప్పాను కదా పిన్ని అని సుమన అంటుంది. తనకు తెలిస్తే ప్రాణాలు కాపాడుతుంది కానీ ప్రాణం తీయాలి అనుకోదు సుమన అని విశాల్ అంటాడు. ఎవరికో తెలుసా గురువుగారు అని నైని అడుగుతుంది. రేపు శాంభవి అమ్మవారి గుడికి వెళ్తే కానీ స్పష్టంగా ఎవరికి అనేది చెప్పలేను నైని అని గురువుగారు అంటారు. కట్ చేస్తే, వల్లభ అఖండ స్వామి దగ్గరికి వచ్చి శరణు కోరుకుంటాడు. ఏం చేస్తున్నావ్ వల్లభ అని తిలోత్తమ అంటుంది. మీ అమ్మ ఆలోచన వేరే లాగా ఉంది వల్లభ అని అఖండ స్వామి అంటాడు. గండం ఒకరికి కాదు ఇద్దరికీ అని అఖండ స్వామి చెబుతాడు.
స్వామి మీరు చెప్పింది నిజమే కానీ ఇంకొకరు ఎవరో నేను నిర్ణయించుకోవాలి అని తిలోత్తమ అంటుంది. నాకు అర్థం కాలేదు అని వల్లభ అంటాడు. నైనికి గండం వస్తే విశాల్ ని చంపేయాలని మీ అమ్మ ఆలోచన అని అఖండ స్వామి అంటాడు. ఒకవేళ విశాల్ కి గండం ఉంటే నైనీని కూడా చంపేయాలనుకుంటున్నాను గురువుగారు అని తిలోత్తమ అంటుంది. వాళ్ళిద్దరికీ కాకుండా ఇంకెవరికైనా గండం వస్తే అని వల్లభ అంటాడు. స్వామి మా అమ్మ ప్లాన్లు బాగానే ఉన్నాయి కానీ వర్క్ అవుట్ కాకపోతే అందులో మేము కొట్టుకుపోతాం కదా అని వల్లభ అంటాడు.ఈసారి అఖండ స్వామి కూడా అక్కడికి వస్తారు అని తిలోత్తమ అంటుంది. ఎందుకు మొన్న బుల్లెట్ ఆయనకు తగిలేది నాకు తగిలింది ఇప్పుడు ఆయనకు తగులుతుందా అని వల్లభ అంటాడు. రేపు నాకు ప్రాణగండం లేదు వల్లభ అని అఖండ స్వామి అంటాడు.
రేపు కచ్చితంగా మీరు కూడా రావాలి స్వామి నాగయ్య పాము కూడా వస్తుంది అని తిలోత్తమ అంటుంది. మీరు గుడికి వెళ్ళండి పూజ జరిగే చోట ఇలాంటి రేఖలు గీస్తాను పాము ముందుకు రాలేదు అని అఖండ స్వామి అంటాడు. ఎవరికి అనుమానం రాకుండా చేయండి అని తిలోత్తమ ఉంటుంది. ఇలాంటి రేఖ ఉంటుందని ఎవరికీ అనుమానం రాదు ఇక మీరు వెళ్ళండి అని అఖండ స్వామి అంటాడు. కట్ చేస్తే, మమ్మీ రేపు గుడి దగ్గర ఏం చేయాలనుకున్నామో ఇందాకే డిసైడ్ చేసుకున్నాం కదా ఇంకేం ఆలోచిస్తున్నావు అని వల్లభ అంటాడు. రేపు మనం చేస్తున్న ప్రయోగం చిన్న చితకది కాదు ఆలోచించకుండా ఎలా ఉంటాను అని తిలోత్తమ అంటుంది. మనం సేఫ్ అవుతామా అని వల్లభ అంటాడు. అసలు నైనీకి ఎందుకు తెలియడం లేదని ఆలోచిస్తున్నాను అని తిలోత్తమ అంటుంది. మనకే మంచిది కదా మమ్మీ అందులో అంతగా ఆలోచించాల్సింది ఏముంది అని వల్లభ అంటాడు .
విశాలాక్షి గారడి చేసిన పర్వాలేదు కానీ రేపు మన కూడా ప్రమాదమే అని తిలోత్తమ అంటుంది. మమ్మీ రేపు కనుమరుగయ్యే వాళ్ళ గురించి ఆలోచించకు ఫోటో పెట్టి సంతాప సభ ఏర్పాటు చేశాక దశదిశకర్మ అయిపోయిన తర్వాత దాని గురించి అందరూ మర్చిపోతారు గాయత్రీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నువ్వే పెద్ద దిక్కువి అని వల్లభ అంటాడు. నేనే డైరెక్ట్ గా సింహాసనం మీద కూర్చుంటానంటే గొడవ చేస్తాడు విక్రాంత్ అందుకే ఉలోచితో సహా మిగతా పిల్లల్ని కూడా వారసులుగా ప్రకటిస్తాను, పేరు వాళ్లది పెత్తనం మనది అని తిలోత్తమ అంటుంది. ఈసారి మిస్ అయితే నా పేరే మార్చుకుంటాను అని వల్లభ అంటాడు. నీకంటూ పేరు కాదు ప్రతిష్ట ఉండాలి అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే, అందరూ శాంభవి గుడి దగ్గరికి వస్తారు. ఫస్ట్ టైం మా ఆయన పని చేస్తున్నాడు చూశారా అని హాసిని అంటుంది. అమ్మవారికి సేవ చేస్తే మంచిదే కదా వదిన అని విశాల్ అంటాడు. ఎవరికి ఆపద వస్తుందో తెలియట్లేదు నైనికి కూడా అర్ధం కావట్లేదు అని హాసిని అంటుంది. శాంభవి గుడికి వచ్చిన తర్వాత అవన్నీ ఎందుకు అక్క అని నైని అంటుంది. ఈ దండకి విషం స్ప్రే చేసాం మమ్మీ అలాంటిది నా చేత మోయిస్తున్నావు అని వల్లభ అంటాడు.
నోరు ముయ్యరా అని తిలోత్తమ అంటుంది. అందరూ అమ్మవారి దగ్గరికి వస్తారు.కేవలం నాగులకు మాత్రమే తెలిసే విష ప్రయోగం జరుగుతుంది అని నైనీకి ఎలాగైనా విషయం చేరవేయాలి అని పెద్ద బొట్టమ్మ అనుకుంటుంది. నాగులు ఈ గుడిలోకి ప్రవేశించకుండా అగ్ని రేకులని ఏర్పాటు చేయాలి అని అఖండ స్వామి అగ్ని రేఖను గీస్తాడు. అమ్మవారికి దండ వేసి పూజ మొదలు పెట్టండమ్మ అని స్వామి అంటాడు. తల్లి నువ్వే అండగా ఉండాలని అని వల్లభ శాంభవి మెడలో దండని వేస్తాడు. అందరూ ప్రసాదాలు పూలు తెచ్చి అక్కడ పెడతారు.ఇంతలో పెద్ద బొట్టమ్మ వస్తుండగా అగ్ని రేఖ అడ్డుకుంటుంది ఎవరు చేశారు ఈ పని అని పెద్ద బొట్టమ్మ అంటుంది. నేనే చేశాను అని అఖండ స్వామి అంటాడు. మనిషి రూపంలో వచ్చావు ఈ రేఖను దాటాలంటే నువ్వు పాముగా మారి వెళ్ళలేవు లోపలికి వెళ్లి విష ప్రయోగం జరగకుండా ఆపలేవు అని అఖండ స్వామి అంటాడు. ఇలా చేయకూడదు కదా అని పెద్ద బొట్టమ్మ అంటుంది. విధిరాత నేను అమలు చేస్తున్నాను అని అఖండ స్వామి అంటాడు.నేను ఈ రూపంలోనే వెళ్తాను నైనికి విషయం చెప్పినా చాలు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. అత్తయ్య ఏమైనా ప్లాన్ చేశారా అని సుమన అడుగుతుంది.
నా సంగతి పక్కన పెట్టు నువ్వేం చేసావో చెప్పు అని తిలోత్తమ అంటుంది. అమ్మవారు ముందు పెట్టిన ప్రసాదంలో విషం పెట్టాను అది మా అక్క తింటే చాలు అని సుమన అంటుంది. ఇంతలో పెద్ద బొట్టమ్మ వస్తున్నది గమనించిన సుమన పెద్ద బొట్టమ్మ ఇక్కడికి ఎందుకు వస్తుంది తనను ఆపాలి అంటూ వెళ్తుంది. స్వామి నైనికి ముందు ఎందుకు తెలియడం లేదు అని విశాల్ అంటాడు . గండం ఎవరికోస్తుందోనని అందరి మనసులో ఊహిస్సలాడుతూ ఉండాలి అని గురువుగారు అంటారు. హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావ్ పెద్దమ్మ అని సుమన అడుగుతుంది. వెళ్లాలి సుమన విష ప్రయోగం జరుగుతుంది అని పెద్ద బొట్టమ్మ అంటుంది. నీకెలా తెలుసు అని సుమన అంటుంది. నీకు తెలుసా సుమనపద వెళ్లి నైనికి చెబుదాము అని పెద్ద బొట్టమ్మ అంటుంది. నీకు ఉలోచిని ఎత్తుకొని ముద్దు చేసి ఆడించాలని ఉందా లేదా అని సుమన అంటుంది. గురువుగారు ఎవరికి వస్తుంది ఎలా వస్తుంది తెలుసా అని విశాల్ అంటాడు. మృత్యువు మన వెన్నంటే ఉంటుంది విశాల్ అని గురువుగారు అంటారు. వల్లభ శాంభవి మెడలో వేసిన దండలో నుండి విషం కింద పెట్టినా ప్రసాదంలో పడుతుంది.అంటే మేము ఎక్కడ ఉంటే అక్కడ గండం ఉంటుంది అంటారా అని హాసిని అంటుంది. అమ్మవారే ఇక కాపాడుతుంది అక్క అని నైని అని అంటుంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!