Tollywood: గతకొన్నాళ్ళుగా తెలుగు చిత్ర పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసినదే. టిక్కెట్ల రేట్ల విషయంలో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో మెగాస్టార్ చిత్ర పరిశ్రమ తరపున రంగంలోకి దిగి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని పలుమార్లు ఒంటరిగా కలిశారు. ఇపుడు తాజాగా పలువురు బడా స్టార్లు కూడా చిరంజీవితో మమేకమై ఏపీ సర్కార్ వద్దకు వెళ్లడం జరిగింది.. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయంపైన రకరకాలుగా సోషల్ మీడియాలో అనేక డిబేట్లు జరుగుతున్నాయి..
Jagan: ‘మంచు’ ఫ్యామిలీని జగన్ ఓదార్చారా?
Tollywood: టాలీవుడ్ జగన్ పాదాక్రాంతం అయిందా?
సమస్య ఏదైనా ఏపీ ప్రభుత్వం తన పట్టుదలనే నిరూపించుకొనే పనిలో పడింది. ఎదుటి పక్షాన్ని పాదా క్రాంతం చేసుకునేంతవరకూ నిద్రపోవడంలేదు. తాజా ఉదాహరణే చెప్పుకోవచ్చు.. విజయవాడ విధుల్లో స్వైరవిహారం చేసి, సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేసిన ఉద్యోగ సంఘాలు సర్కారు చెప్పిన మాటకే తలాడించే పరిస్థితి. ఇక OTS వంటివాటిపై ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, రాజధాని విషయం గురించి ఎవరెంత రచ్చ చేసినా కూడా ప్రస్తుతం సర్కారు పంతమే పైచేయిగా ఉందనిపిస్తోంది.
Bunny NTR: బన్నీ, ఎన్టీఆర్ జపం చేస్తున్న బాలీవుడ్ టాప్ హీరోయిన్..!!
టాలీవుడ్ పరిస్థితి ఇదే:
ఒకటి రెండు చిన్నవిషయాలు తప్పించి, టాలీవుడ్ కి సంబంధించిన సమస్యల విషయంలో, ప్రభుత్వ పంతమే నెగ్గించుకుంది. ఇక ప్రస్తుతం జరిగిన మొత్తం వ్యవహారంలో గాని మనం చూసుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి పేరున్న హేమాహేమీలను(పెద్ద నటులు) తాడేపల్లి మార్గం పట్టించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. అంతేకాదు.. ప్రభుత్వం పట్టుబడితే..ఎలాంటి వారైనా అంజలి ఘటించాల్సిందే.. అనేసందేశం ఈ సమాజానికి పంపేసింది. ఇక ఏదేమైనా..జగన్ వేసిన ఉచ్చులో టాలీవుడ్ పడిందా, లేదంటే ఓ మెట్టు వెనక్కితగ్గిన టాలీవుడ్ గెలిచిందా? అన్న విషయంపైన క్లారిటీ రావాలంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి మరి.