Pregnancy diet : అమ్మా అని పిలిపించుకోవడానికి ప్రతి తల్లి కూడా ఎంతగానో ఎదురుచూస్తుంది. కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసినప్పటి నుండి ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరు కూడా తగినంత పోషకాహారం తీసుకోవాలి. ఎందుకంటే తల్లి మరియు శిశువు ఆరోగ్యం రెండు కూడా చాలా ముఖ్యం కాబట్టి. అందకే పోషకాలతో కూడిన ఆహారంతో పాటు విటమిన్లు, ఖనిజాలు,కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, నీటితో సహా అన్ని బలవర్ధకమైన ఆహారం తింటూ ఉండాలి. అప్పుడే తల్లితో పాటు పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.మరి కడుపుతో ఉన్న మహిళలు ఎలాంటి ఆహారం తింటే మంచిదో తెలుసుకుందామా..
గర్భంతో ఉన్న మహిళలు ఎలాంటి ఆహారం తినాలంటే..?
గర్భంతో ఉన్న మహిళలకు ఐరన్ చాలా ముఖ్యమైనది. హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ రక్తం తక్కువగా ఉంటే మాత్రం ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు తినాలి..ముఖ్యంగా పండ్లు, ఆకుకూరలు కూడా బాగా తినాలి పాలకూర, బచ్చలికూరలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.కాబట్టి రక్తహీనతను నివారించాలంటే గర్భిణీలు కచ్చితంగా ఆకుకూరలను తినాలి. అలాగే చికెన్, మటన్లలో ఐరన్ అధికంగా ఉంటుంది.
పోషకాహారం అంటే ఏమేమి తినాలో తెలుసుకోండి :
ఇంకా ఖర్జూరం, వాల్నట్, బాదం మొదలైన డ్రై ఫ్రూట్స్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దానిమ్మ పండు, బీట్ రూట్, క్యారెట్ లను కూడా గర్భిణులు తింటూ ఉండాలి.అలాగే బెల్లం, రాగులు, నువ్వులలో కూడా ఐరన్ శాతం అధికంగానే ఉంటుంది.ఇంకా కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు సి విటమిన్ ఎక్కువగా ఉండే పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు,చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్ధాలు, పీచుపదార్ధాలు తీసుకోవాలి.గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారంను రోజులో కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినాలి.