అమరావతి: ఏపి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్తో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్కు చంద్రబాబు వివరించారు. మంత్రులు, వైసిపి సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మండలి రద్దు, రాజధాని అంశంతో పాటు మీడియాపై కేసులను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చంద్రబాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు వెంట మాజీ మంత్రులు నిమ్మకాయ చినరాజప్ప, దేవినేని ఉమా, జవహర్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే లు కింజరపు అచ్చెన్నాయుడు, రామానాయుడు, శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు తదితరులు ఉన్నారు.