తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రభుత్యాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మద్దతుగా ఉన్నవారికే ప్రభుత్వ పధకాలు అందేలా చేస్తున్నారన్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఆమ్మఒడి పెద్ద మోసం, దగా అని ఆయన విమర్శించారు. సీఎం జగన్ తీసుకున్న విధానాలు వల్ల విద్యా వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో పడిందనీ అన్నారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పాలు కూడా సక్రమంగా అందించడంలేదని పేర్కొన్నారు. ఆమ్మఒడి కోసం కార్పొరేషన్ నిధులు మళ్లించారని జ్యోతుల విమర్శించారు.