మధ్య పేపరు చూస్తే చికాకువేస్తోంది!
రెండు పేజీల్లో ఇంటర్లో ర్యాంకులు!
ఏకాలేజికి ఎన్ని ర్యాంకులువచ్చేయో ర్యాంకుల వాళ్ళ ఫోటోలు!
అసలు ఈ ర్యాంకుల పిచ్చి అమ్మ నాన్నలది!
పిల్లల్ని టెన్త్ నుంచే అరగదియ్యడం ప్రారంభిస్తారు!
వాళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదు!
ఓ సరదా లేదు!
ఓ సంతోషం లేదు!
ఆలా పుస్తకాల్లో బతకడవె!
ఏకాలేజీలో ఎన్ని ర్యాంకులు ఉన్నాయో చూసి వాళ్ళని అందులో పడెయ్యడం, అంతే!
మా కాలేజిలో పద్నాలుగు గంటలు చదివిస్తాం!
నయం! నిద్రపోతున్నప్పుడు క్యాసెట్లు పెడతాం అనలేదు!
ఒక విధంగా ద్వీపాంతర వాసం!
వాళ్ళని తప్పు పట్టలేం!
అది వాళ్ళ వ్యాపారం!
మన బుద్ధి ఏమైంది?
ఈ ఎంట్రెన్సులు లేకముందు ఎవరు డాక్టర్టు ఇంజినీర్లు అవలేదా?
అన్నిటి కంటే గమ్మత్తు..
ఈ ర్యాంకుల వాళ్ళతో ఇంటర్వ్యూలు!
నేను డాక్టరు అయి ప్రజలకు సేవ చేస్తాను!
ప్రజలకి సేవ చెయ్యడానికి డాక్టర్ అవనక్కర్లేదు!
మదర్ థెరెసా ఏమి చదివింది?
గాంధీ డాక్టరా?
ప్రతి కాలేజీలో లెక్చరర్లు సరిగ్గా పాఠాలు చెప్పి ఇంటి దగ్గర అమ్మ నాన్న కొంచెం శ్రద్ధ చూపిస్తే ఈ ట్యూటోరియళ్ళు అవసరం లేదు!
ఇద్దరూ ఆర్జించకపోతే ఈఖర్చు ఎలా భరిస్తాం అంటారు..
మరి మేమంతా చదువుకోలేదా?
మా పిల్లలు చదువుకోలేదా?
మాకు లక్షలు కోట్లు లేవు అయినా చదివించేవు!
ఇప్పటి మోడర్న్ తల్లులకు ఐపాడ్లు ఐఫోన్లు తప్ప ఇంకేవి పట్టవు!
పిల్లకోసం మనం కొన్ని సరదాలు వదులుకోవాలి తప్పదు!
ఇప్పటికైనా మేలుకొని ఈ ర్యాంకుల పిచ్చి మానండి!
పిల్లల్ని బలి చేయకండి!
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ