అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ స్థాయి ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను మరో మూడు నెలల్లోగా నిర్వహిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం హైకోర్టుకు తెలియజేశారు.
విజయవాడకు చెందిన ఎ.వేణుగోపాలకృష్ణమూర్తి దాఖలు చేసిన పిల్పై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్నతాధికారుల ద్వారా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల18వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బిసిలకు 34శాతం, ఎస్సిలకు 19.08శాతం, ఎస్టిలకు 6.77శాతం కోటా ఉంటుందని పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?