విజయవాడ: ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎయిర్ పోర్టులో జగన్ తిన్న తిండిని లోకేశ్ కు అంటగడతారా? అని మండిపడ్డారు. మీ దొంగ పత్రిక రాసిన వార్తలో ఉన్న తేదీల్లో ఎక్కడ ఉన్నాడో లోకేశ్ మగాడిలా బయటపెట్టారని చెప్పారు. మీ వాడు మగాడో, కాదో నువ్వే తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. ‘ప్రజాధనాన్ని పందికొక్కులా తిని, అది అరగక, చిప్పకూడు తిన్న నువ్వు, మీ తుగ్లక్ ముఖ్యమంత్రా లోకేశ్ గురించి మాట్లాడేది?’ అంటూ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీది మనిషి పుట్టుకే అయితే… మీ దొంగ పత్రిక రాసిన వార్తకు ఆధారాలను చూపించాలంటూ సవాల్ విసిరారు.