మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్
ఆమోదం తెలపడంతో రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్డు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. అయితే, అక్కడా తక్షణమే తీర్పు వెలువడే పరిస్థితులు కనిపించకపోవడంతో, ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాకపోవడంతో అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు లేఖ రాసింది. తద్వారా సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమైంది. అయితే పిటిషన్లో వివరాలు సమగ్రంగా లేవంటూ తక్షణమే విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించనట్లు తెలుస్తోంది.
మరోవైపు, రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని సీఎం జగన్ ఆహ్వానించినట్లు సమాచారం. శంకుస్థాప కార్య క్రమానికి ప్రత్యక్షంగా, ఒకవేళ వీలు కాకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనవలసిందిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఆహ్వనించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మోడీ ప్రయత్నించిన్నట్లు సమాచారం. అయితే, ఓ వైపు హైకోర్టులో తీర్పు 14వ తేదీన వెలువడటంపై అస్పష్టత, మరోవైపు సుప్రీంకోర్టులోనూ సానుకూల పరిణామాలు కనిపించకపోవడం, స్వల్ప వ్యవధిలోనే ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు అయ్యే వాతావరణం లేకపోవడంతో ఆగస్టు పదహారున శంకుస్థాపనను వాయిదా వేసుకుంది ఏపీ ప్రభుత్వం.
కాగా, ఏపీ సర్కారు తాజాగా నిర్ణయించిన ముహుర్తం దసరా. అక్టోబర్ 25వ తేదీ. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు సమాచారం. ఒకటి దాదాపు రెండు నెలల వ్యవధి ఉన్నందున అప్పటి వరకు మూడు రాజధానులపై ఉన్న వివాదాలు, సమస్యలు తొలగిపోతాయనే నమ్మకం. మరొకటి, అమరావతి రాజధానిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసింది అక్టోబర్ 21న విజయదశమి. 2015లో జరిగిన ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను గుర్తు చేసేలా 2020 అక్టోబర్ 20న శంకుస్థాపన పెట్టుకుంటున్నట్లు సమాచారం.
అయితే, ఈ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని కోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో ఏపీలో బీజేపీ సపోర్ట్ తోనే మూడు రాజధానుల ప్రక్రియ వేగవంతం చేశారని పలు పార్టీలు ఆరోపించాయి. ఇలాంటి సమయంలో ప్రధాని హాజరు కానున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఒకవేళ, ప్రత్యక్షంగానో లేదా ఆన్లైన్ రూపంలో మోదీజీ ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటే మాత్రం అది ఏపీ చరిత్రలో నిలిచిపోతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.