అమరావతి: జమీన్ రైతు పత్రిక సంపాదకుడు దోలేంద్ర ప్రసాద్పై దాడి చేసిన నెల్లూరు రూరల్ అధికారపక్షం శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై నెల్లూరు పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలుతో సరిపెట్టారు. పోలీసు స్టేషన్పై దాడి చేశారన్న అభియోగంపై జనసేన శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ను మాత్రం రాజోలు పోలీసులు అరెస్టు చేశారు. ఏమిటీ వ్యత్యాసం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ కూడా ఈ విషయం ప్రస్తావించారు. అధికారపార్టీ ఎమ్మెల్యేకు ఒక న్యాయం, ప్రతిపక్షం ఎమ్మెల్యేకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. చిన్న కేసును పోలీసులు అతి చేస్తున్నారనీ, స్టేషన్ బెయిల్తో పోయేదానిని నాన్ బెయిలబుల్ వారెంట్ వరకూ తీసుకువెళ్లారనీ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
మంగళవారం ట్విట్టర్లో ఈ విషయం ప్రస్తావించిన లోకేష్ ఒక పత్రికా విలేఖరిని చంపుతానని బెదిరించిన అధికారపక్షం శాసనసభ్యుడిని అరెస్టు చేయని ప్రభుత్వం మకిలిపురం ఘటనలో ప్రజల తరపున ప్రశ్నించిన వరప్రసాద్ను మాత్రం అరెస్టు చేసింది. అధికారం ఉంటే ఎంత దౌర్జన్యమైనా చేయవచ్చు, ప్రతిపక్షం న్యాయమడిగితే మాత్రం తప్పు, ఏమిటీ నియంతృత్వం అని ప్రశ్నించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?