ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల విస్తరణకు అధికారంలో ఉన్న వైసీపీ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో 25 జిల్లాలుగా విస్తరింప చేయాలని ప్రభుత్వం ఆలోచన చేయగా ఇప్పుడు ఆ సంఖ్య 26 కి చేరినట్లు టాక్. పూర్తి విషయంలోకి వెళితే కొత్త జిల్లాల ప్రకటనపై రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త జిల్లాలకు సంబంధించి వచ్చే యేడాది జనవరి 26వ తారీకు అనగా గణతంత్ర దినోత్సవం నాడు స్పష్టమైన ప్రకటన ఉంటుందని ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇటీవల గుంటూరులో రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గాలు భారీగా జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా అరకు నియోజకవర్గం విషయంలో కాస్త సందిగ్ధత నెలకొని ఉన్నట్లు కోన రఘుపతి చెప్పుకొచ్చారు. విషయంలోకి వెళితే ఈ పార్లమెంట్ పరిధిలో నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండటం తో … పైగా ఈ అరకు పార్లమెంట్ పరిధిలో ఎక్కువ గిరిజన జనాభా ఉండటంతో…ఈ నియోజకవర్గం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు అన్నట్టు మాట్లాడారు.
అయితే ఎక్కువ శాతం అరకు పార్లమెంట్ స్థానాన్ని రెండుగా చేయాలని నిర్ణయించుకున్నట్లు… అందువల్లే 25 కొత్త జిల్లాలు కాస్త 26 జిల్లాలుగా ఏర్పడనున్నట్లు టాక్. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అయితే కొన్ని నియోజకవర్గాల విషయంలో సమస్య ఉండటంతో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఒక కమిటీని నియమించింది. ప్రభుత్వం సూచించిన విధంగానే కమిటీ కూడా నివేదిక రూపొందిస్తే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో దాదాపు జనవరిలోనే ముందడుగు పడినట్లే. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాటల బట్టి జనవరి 26 వ తారీఖుకి ఈ విషయం ఓ కొలిక్కి వచ్చినట్లే అన్న టాక్ వస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?