Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ అల్లర్ల వెనక వైసీపీ ప్రభుత్వం తప్పిదం ఉందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా కోనసీమ గొడవలు జరిగాయని పేర్కొన్నారు. అందువల్ల ఇప్పటివరకు ఘటనాస్థలానికి సీఎం జగన్ తో పాటు మంత్రులు వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఒకపక్క కోనసీమ తగలబెడితే మరోపక్క మంత్రులు బస్సుయాత్ర దేనికని ప్రశ్నించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక జిల్లాల విభజన విషయంలో ప్రభుత్వం వన్ ఎలక్షన్ వ్యవహరించిందని పేర్కొన్నారు. వైసీపీ పార్టీలో రెండు వర్గాల మధ్య గొడవ అని పవన్ తెలిపారు. ఇక ఇదే సమయంలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు గురించి ప్రస్తావన రాగా.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఢిల్లీ బీజేపీ నేతలతో నే సంబంధాలు ఉన్నాయి. కానీ ఏపీ నేతలతో కాదని తెలియజేశారు. మరోపక్క టీడీపీ తో ఒత్తులు ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో దానిపై కూడా మీడియా.. “మహానాడు” ప్రస్తావన తీసుకురావడం జరిగింది.
మహానాడు గ్రాండ్ సక్సెస్ పై మీ అభిప్రాయం.. ఏంటని మీడియా విలేకరి ప్రశ్నించగా దానికి పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మహానాడు సక్సెస్ అయితే మరీ మంచిది అంటూ పవన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ పాలన బాగుంటే పొత్తుల ప్రస్తావన ఎందుకు వస్తుంది అని మీడియాకి పవన్ ఎదురు ప్రశ్న వేశారు. కొన్ని సామాజిక వర్గాలను వైసీపీ శత్రువుగా భావిస్తుంది చివరాకరికి వైసిపి యే ఒంటరి అవుతుందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?