AP Politics: రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నేడు ఒక సర్వే పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒక సర్వే రెండు ప్రధాన పార్టీలో కలవరం మొదలు అయింది. చర్చ జరుగుతోంది. అది ఏమిటంటే.. ప్రకాశం జిల్లాలోని కీలక నేత ఒకరు ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించారట. పార్టీకి అనుభందంగానో, లేక స్వంతంగానో ఓ న్యూట్రల్ సంస్థ తో సర్వే చేయించారట. వాటిలో కృష్ణా జిల్లాలో గుడివాడ, గన్నవరం, విజయవాడ పశ్చిమ, దెందులూరు, గుంటూరు జిల్లా లో సత్తెనపల్లి, నరసరావుపేట, పొన్నూరు, మంగళగిరి, ప్రకాశం జిల్లాలో చీరాల, అద్దంకి, పర్చూరు, ఒంగోలు, కందుకూరుతో పాటు రాయలసీమలో మరో రెండు నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తే అనూహ్య ఫలితాలు వచ్చాయిట..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొత్తం రాష్టం మొత్తం సర్వే చేయించాలి అంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి శాంపిల్ గా 20 నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తే ఒక్కో చోట ఒక్కో ఫలితంవచ్చిందట..!
* వాటిలో అద్దంకి విషయానికి వస్తే కొద్దిగా గట్టి పోటీ అయినా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కి అనుకూలంగా వచ్చిందట. పర్చూరులో టీడీపీ బలహీనంగా ఉన్నప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కి కాస్త అనుకూలంగా వచ్చింది. అంటే అక్కడ వైసీపీ ఇంచార్జి బాగా బలహీనంగా ఉన్నట్టు తేలింది..!
* అలాగే గన్నవరం వల్లభనేని వంశీకే కాస్త అనుకూలంగా ఉందట. టీడీపీ నుండి వెళ్లిన వంశీ… తనతో పాటూ 10 శాతం వరకు టీడీపీ ఓట్లని తీసుకెళ్లారని అంచనా చేస్తున్నారు.. అది వంశీకి ప్లస్ అయినట్టుగా చెప్తున్నారు. గుడివాడ లో వైసీపీ,టీడీపీ కి పొటా పోటీ జరిగినా కాస్త కొడాలి నానికే మొగ్గు ఉందట. ఇక్కడ టీడీపీ బలమైన ఇంఛార్జిని దించితే ఫలితం మారొచ్చు అంటున్నారు..!
* సత్తెనపల్లిలో వైసీపీ లీడ్ లో ఉండగా.. ఇక్కడ టీడీపీలో ఉన్న వర్గాలు కారణంగా బాగా దెబ్బ కొట్టినట్టు చెప్తున్నారు.. ఇక నరసారావుపేట లో కూడా వైసీపీ బలంగా ఉన్నప్పటికీ టీడీపీకి అవకాశం ఉందట. మంగళగిరిలో ఎవరూ ఊహించని విధంగా టీడీపీ లీడ్ లోకి వస్తోందట. ఎమ్మెల్యే ఆర్కే పట్ల కొన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి, రాజధాని ప్రభావం కూడా ఉన్నట్టు సర్వేలో తేలింది
.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
* దెందులూరు లో హోరా హోరీగా ఉన్నా వైసీపీ లీడ్ లో ఉందని సర్వే వచ్చిందట. సర్వే చేసిన నియోజకవర్గాల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. వాస్తవానికి దెందులూరులో వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వ్యతిరేకంగా ఉందని చాలా మంది అనుకుంటున్నారు కానీ ఆయనే 2-3శాతం లీడ్ లో ఉన్నట్టు వచ్చిందట. అదే విధంగా గన్నవరం లో వంశీ పార్టీ మారిన తరువాత అయన కు వ్యతిరేకత ఎక్కువ అయింది, వైసీపీ తరపున అయన గెలుపు కష్టం అని అందరు అనుకుంటుంటే వంశీ కే అవకాశం ఉన్నట్లు వచ్చిందట. గుడివాడ లో కూడా కొడాలి కే అనుకూలంగా ఉందని తెలిసింది. ఈ 20 నియోజక వర్గాల్లో బయట జరుగుతున్న చర్చ వేరు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ, విశ్లేషణలు వేరుగా ఉన్నాయి. దీనితో ఆ సర్వే సక్రమంగా జరిగిందా..? లేదా, వాళ్ళు ఏమైనా తప్పుగా చేశారా..? మళ్ళీ సర్వే చేయించాల్సిన అవసరం ఉందా..? వాళ్లు సర్వే కు ఏఏ శాంపిల్స్ తీసుకున్నారు..? అనే విషయాలపై అంతర్గతంగా అనలైజ్ చేసుకుంటున్నారు. ఇది పెద్ద చర్చనీయాంశంగా, పెద్ద కుంపటిగా మారింది..!