హైదరాబాద్: తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల బరిలో కోదండరాం పార్టీ పోటీ చేయనుంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని, ప్రతిపక్షాలను బలహీనపర్చాలనే ఉద్దేశంతోనే వార్డుల విభజన చేశారని ఆరోపించారు. రిజర్వేషన్లను అధికార పార్టీ తమకు అనుకూలంగా ఖరారు చేసుకుందని మండిపడ్డారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల ప్రక్రియపై ప్రతిపక్షాలు హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.