తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గం రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపి కి జై కొట్టిన నాటినుండి వరుస వివాదాలతో తల బొబ్బి పెడుతుందట. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ క్యాడర్ నుంచి సరైన సహకారం అందకపోవటంతో పాటు వర్గ పోరు మరింత ఇబ్బంది పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దూకుడు తగ్గించి వైసీపీలో సమానంగా ఉంటున్న, ఆల్రెడీ ఉన్న వర్గాలతో వివాదాలు ఇరుకున పెడుతున్నాయి అట. ఇటువంటి పరిణామాలతో వైసీపీలో వల్లభనేని వంశీ మనుగడ అంత ఈజీ కాదు అన్న టాక్ వినిపిస్తోంది. వల్లభనేని వంశీ మూడు ఎన్నికలు చూసిన అనుభవం ఉన్న నాయకుడు. పార్లమెంట్ కి ఒకసారి ఎమ్మెల్యే గా రెండు సార్లు వల్లభనేని వంశీ పోటీచేశారు.
పార్లమెంటు స్థానానికి ఓడిపోయిన వంశీ ఎమ్మెల్యే గా రెండు సార్లు గెలిచి తన సత్తా చాటారు. 10 సంవత్సరాల పాటు టిడిపి నేతగా ఉన్న వంశీ ప్రస్తుతం సరికొత్త పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం గన్నవరం నియోజకవర్గం పై మంచి పట్టు సాధించడంలో సక్సెస్ అయ్యారు. గన్నవరం నియోజకవర్గంలో తల పండిపోయిన రాజకీయ నాయకులైన దాసరి వర్గాన్ని పక్కనపెట్టి తనకే సీటు వచ్చేలా రాజకీయం చేయడంలో వంశీ తనకి ఎదురులేదని నిరూపించుకున్నారు. అయితే ప్రస్తుతం వైసిపికి జై కొట్టిన నాటినుండి వల్లభనేని వంశీ రాజకీయాలలో ఎదురీత ఈదుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సహజంగా వల్లభనేని వంశీ ది దూకుడు తత్వం.
కృష్ణా జిల్లా రాజకీయాల్లో అప్పటిలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తో సైతం సై అంటే సై అని మాటల యుద్ధం జరిగేది. ఇంత దూకుడుగా ఉండే వల్లభనేని వంశీకి ప్రస్తుతం వైసీపీలో అన్ని వర్గాలతో కలసి పని చేయాలి అనుకుంటున్నా కానీ పరిస్థితులు అనుకూలించడం లేదంట. వైసిపి పార్టీని ఇంతవరకు నడిపించిన యార్లగడ్డ, దుట్టా వర్గాల నుండి వివాదాలు నెలకుంటున్నట్లు గన్నవరం నియోజకవర్గం లో టాక్. మరోపక్క అసలు గన్నవరం నియోజకవర్గం లో వైసీపీ పార్టీ వర్గ పోరు లేదన్న వార్తలు వస్తున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో వైసిపి పార్టీ నాయకుల మధ్య వివాదాలు సృష్టించడానికి కొన్ని మీడియా సంస్థలు కల్పిత కథనాలు ప్రసారం చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ రాజకీయ ప్రస్థానం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.