అప్పట్లో విభజనతో నష్టపోయిన ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు రాజధానిగా అమరావతి ని గుర్తించడం జరిగింది. అయితే అమరావతిని రాజధానిగా గుర్తించడం సరైన నిర్ణయం కాదని కేంద్రం విధించిన శ్రీకృష్ణ కమిటీ తెలపడం జరిగింది. అయినా గాని చంద్రబాబు ఆ నిర్ణయాలను పక్కనపెట్టి తాను అనుకున్నదే తావు గా అమరావతిని ఏకైక రాజధానిగా డిక్లేర్ చేసారు.
ఇదిలా ఉండగా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైయస్ జగన్ మూడు పంటలు పండే రైతులు దగ్గర నుండి 33 వేల ఎకరాలు సేకరించి చంద్రబాబు తలపెట్టిన ఈ అమరావతి రాజధాని కార్యక్రమాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తూనే వచ్చారు. పరిస్థితి ఇలా ఉండగా అధికారంలో ఉన్న చంద్రబాబు అనేక ప్రభుత్వ వ్యతిరేకత నిర్ణయాలు తీసుకోవడంతో, రాష్ట్రంలో ప్రత్యేక హోదా విషయంలో ప్రజా వ్యతిరేకత రావటంతో బిజెపి కి కటీఫ్ చెప్పి 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయగా చిత్తుచిత్తుగా ఓడిపోయారు.
దీంతో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానులు అంటూ సరికొత్త కాన్సెప్ట్ తెరపైకి తెచ్చి… అతి తక్కువ టైమ్ లోనే కేంద్రంతో ఆమోదముద్ర పొందుకునేలా వ్యవహరించి రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్ణయానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. మొదటి నుండి వైయస్ జగన్ కి విశాఖపట్టణం ని రాజధానిగా పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీలో తాజాగా వార్తలు బయటపడ్డాయి.
ఈ ఐడియా ఉండబట్టే 2014 ఎన్నికల టైంలో తన తల్లి వైయస్ విజయమ్మ ని విశాఖపట్టణం లో ఎమ్మెల్యేగా పోటీ చేయించారట. కానీ ఆవిడ అక్కడ ఓడిపోవడం జరిగింది. ఆ ఎన్నికలలో పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో తాను నమ్మినబంటు అయినా విజయసాయిరెడ్డికి ఆ ప్రాంతాన్ని అప్పజెప్పడం జరిగిందట.
ఇవన్నీ కావాలని జగన్ విశాఖ ని రాజధానిగా గుర్తించాలని ముందునుండే చాలా లాంగ్ రన్ ఆలోచనతో ఉండటంవల్లే 3 రాజధానుల నిర్ణయం అనే కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది అన్నట్టుగా వైసీపీ పార్టీలో టాక్. కాగా ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రజలు అబ్బో జగన్ కి 3 క్యాపిటల్స్ ఐడియా వెనక ఇంత లాంగ్ రన్ స్కెచ్ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.