విశాఖపట్టణం జిల్లాలో చాలా మంది టిడిపి పార్టీ నాయకులు సైకిల్ దిగి పోవటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం వైయస్ జగన్ విశాఖ పట్టణాన్ని రాజధానిగా ఎప్పుడైతే గుర్తించడం జరిగిందో ఉత్తరాంధ్ర ప్రాంతంలో టిడిపిలో ఉన్న కీలక నాయకులు చాలామంది వైసిపి పార్టీ లోకి రావటానికి తెగ ఇష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ జగన్ కి జై కొట్టిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా ఎప్పటినుండో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలక రాజకీయ నేతగా ఎదిగిన గంటా శ్రీనివాసరావు వైస్సార్సీపీ లోకి వస్తారు అన్న వార్తలు ఫస్ట్ నుండి వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే వార్తలు వస్తున్నా కానీ గంటా శ్రీనివాసరావు రాకను విశాఖలో ఉన్న కీలక నాయకులతో పాటు తాజాగా వైయస్ జగన్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టాక్ సరికొత్తగా వినబడుతుంది. గతంలో ఆల్మోస్ట్ ఆల్ విశాఖ క్యాడర్ తో పాటు తన అనుచరులతో జగన్ సమక్షంలో గంట వైసిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆఖరి క్షణంలో గంట రాకను విశాఖలో ఉండే మంత్రి అవంతి అదేవిధంగా విజయసాయిరెడ్డి అడ్డుకోవడం జరిగింది అని అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా వైయస్ జగన్ కూడా వారితో ఏకీభవించి గంటా శ్రీనివాసరావు వచ్చిన పెద్దగా పార్టీకి ఉపయోగం ఉండదని, వస్తే గ్రూపు రాజకీయాలు స్టార్ట్ అవుతాయి అనే సందేహంతో గంటా శ్రీనివాస్ రాకని వద్దంటే వద్దు అన్నట్టుగా వైసీపీలో టాక్ వస్తుంది. చాలా వరకు ఘంటా శ్రీనివాస్ పొలిటికల్ కెరియర్ చూస్తే ఎక్కడ అధికారం ఉంటే అక్కడే అన్నట్టుగా…. ఉండటంతో ఇలాంటి వ్యక్తులు మన పార్టీలో అనవసరమని జగన్ పార్టీ పెద్దలతో చర్చించిన్నట్లు సమాచారం.