YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మార్చి నెల మొదటి తారీకు నుండి మళ్లీ పాదయాత్ర స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. “ప్రజా ప్రస్థానం” పేరిట జరుగుతున్న ఈ పాదయాత్ర గత ఏడాది స్టార్ట్ అయి..నవంబర్ నెల వరకు జరిగింది. ఈలోపు మహమ్మారి కరోనా వైరస్ రాకతో నవంబర్ 9వ తారీకు నాడు పాదయాత్రని వైయస్ షర్మిల ఆపేశారు. అయితే ఇప్పుడు దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో… మార్చి మొదటి తారీకు నుండి పాదయాత్ర స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. నల్గొండ జిల్లా కొండపాకగూడెం నుంచి షర్మిల పాదయాత్రను మొదలుపెట్టనున్నారు.
దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర జరగనుంది. ఇదిలా ఉంటే మరో పక్క షర్మిల..అధికార పార్టీ టిఆర్ఎస్ వైఫల్యాలు ప్రతిరోజూ ఎండగాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల మళ్లీ పాదయాత్రకి రెడీ కావడం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే వైసిపి పార్టీ స్థాపించిన తొలినాళ్లలో.. వైయస్ జగన్ జైలు పాలైన సమయంలో వైయస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012 వ సంవత్సరంలో దాదాపు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. వైసీపీ పార్టీకి కీలకంగా అప్పట్లో షర్మిల పాదయాత్ర నిలిచింది.
అనంతరం 2019 ఎన్నికల సమయంలో.. దాదాపు పదకొండు రోజులపాటు బస్సు యాత్ర నిర్వహించిన షర్మిల “బాయ్ బాయ్ బాబు అంటూ” పలికిన స్లోగన్.. జనాలలో విపరీతంగా చొచ్చుకెళ్లింది. ఈ క్రమంలో.. ప్రస్తుతం వైసీపీ పార్టీకి ఏపీ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నా వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాలలో కీలకంగా రాణిస్తున్నరు. వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి సొంతంగా తెలంగాణ రాజకీయాల్లో.. దూకుడుగా రాణిస్తూ, అధికార పార్టీని ఎండగడుతూ… నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తూ ఉన్న వైయస్ షర్మిల మళ్లీ ఇప్పుడు పాదయాత్ర కి రెడీ అవ్వడం..తెలంగాణా రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?