ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను బడ్జెట్ ధరకే అందించే కంపెనీగా షియోమీ పేరుగాంచింది. తక్కువ ధరలకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఎన్నో ఫోన్లను ఇప్పటికే ఆ కంపెనీ విడుదల చేసింది. అందులో భాగంగానే తాజాగా మరొక ఫోన్ను షియోమీ భారత్లో విడుదల చేసింది. రెడ్మీ 9ఐ పేరిట ఆ ఫోన్ విడుదల కాగా.. తక్కువ ధరకే దాన్ని వినియోగదారులకు అందిస్తున్నారు.
షియోమీ రెడ్మీ 9ఐ ఫోన్లో 6.53 ఇంచుల డిస్ ప్లే ఉంది. ఇది హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ను కలిగి ఉంటుంది. 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెసర్ను ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్ ను ఇచ్చారు. 64, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తోంది. మెమొరీని కార్డు ద్వారా 512జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ను ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు.
రెడ్మీ 9ఐ ఫోన్లో రెండు 4జి సిమ్లను వేసుకోవచ్చు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. బ్లూటూత్ 5.0ను ఇందులో ఉపయోగించుకోవచ్చు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఈ ఫోన్లో ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ను ఇస్తున్నారు.
*రెడ్మీ 9ఐ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,299
* రెడ్మీ 9ఐ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,299.
ఈ నెల 18వ తేదీ నుంచి ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్, ఎంఐ ఆన్లైన్ స్టోర్లలో లభిస్తుంది.