Eatela Rajendar: టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తూ సంచలన విమర్శలు చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. పార్టీకి గుడ్ బై చెప్పిన వెంటనే ఈటలపై ఎదురుదాడి మొదలుపెట్టిన టీఆర్ఎస్ తాజాగా ఆయన నమ్మినబంటుల ద్వారానే అటాక్ చేయిస్తోంది. తాజాగా ఈటల అనుచరుడు అనే పేరున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మీడియా సమావేశం నిర్వహించి ఈటలపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా టీఆర్ఎస్ నేతలను వెనకేసుకు వచ్చారు.
Read More: Eatela Rajendar: స్పీకర్ ఫార్మాట్లో ఈటల రాజీనామా చేయనిది ఇందుకేనా?
పుట్ట మధు మాట ఇది…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత, సంతోష్ రావులపై చేసిన విమర్శలను జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఖండించారు. కవిత ఏనాడు ముఖ్యమంత్రి కూతురుగా ప్రజలతో వ్యవహరించలేదన్నారు. సమస్యలపై స్పందించే విధానాన్ని చూసి కవితను టిబిజికెఎస్ నేతలు తమ గౌరవ అధ్యక్షురాలు ఎన్నుకున్నారని చెప్పుకొచ్చారు. మంథని నియోజకవర్గంలో చీకటి పాలనను అంతం చేసేందుకు కవిత చేసిన కృషి మరువలేమని మదు అన్నారు.కవిత నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారని పేర్కొన్న పుట్ట మధు ఆమె నాయకత్వంలో పనిచేస్తామని స్పష్టం చేశారు.
Read More: Eatela Rajendar: ఆ ఒక్కమాటతో లేచి… ఈటలపై ఫైరవుతున్న కమ్యూనిస్టు పార్టీలు
ఎంపీ గురించి ఏమంటున్నారంటే…
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తెలంగాణ ఆవిర్భావం కోసం, పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పుట్ట మధు తెలిపారు. ఈటల రాజేందర్ తనపై వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పాల్సింది పోయి ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు చేయడం సరికాదని పుట్ట మధు అన్నారు. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నేతలపై చేసిన విమర్శలు వెనక్కి తీసుకోవాలని పుట్ట మధు డిమాండ్ చేశారు.