ఇటీవల టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీ గూటికి చేరారు. ఆయన ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన బూర నర్సయ్య గౌడ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ జేఏసి సభ్యుడుగా పని చేసిన ఆయన 2012 లో టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ సభ్యుడుగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఖర్గే ఘన విజయం .. 24 ఏళ్ల విరామం తర్వాత గాంధీ కుటుంబేతర నేత కాంగ్రెస్ బాస్ గా ఎన్నిక
ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సీటు ఆశించారు. పార్టీ అధినేత కేసిఆర్ ప్రభాకరరెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో అసంతృప్తికి గురైన బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు రాం రామ్ చెప్పారు. బూర నర్సయ్య చేరిక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటి కన్వీనర్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బూర నర్సయ్య గౌడ్.. కేసిఆర్ పైనా, పార్టీపైనా తీవ్ర స్థాయి లో ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన మరో నేతను కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేర్చుకుని బలహీన వర్గాల ఓటు బ్యాంక్ కు దెబ్బ తగలకుండా చూసుకుంది.
Munugodu Bypoll: మునుగోడు రేవంత్ రివర్స్ వ్యూహం.. బీజేపీ, టీఆర్ఎస్ ఊహించలేదు..!?