కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై తెలంగాణ హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాస్టర్ ప్లాన్ పై స్టేకు నిరాకరించిన హైకోర్టు..పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ కాదని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్, వరంగల్లు మాస్టర్ ప్లాన్ విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని హైకోర్టు అభిప్రాయపడింది. రైతుల అభ్యంతరాలు తీసుకుంటామని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ సుమారు 40 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పిటిషన్ల తరుపున న్యాయవాది .. మాస్టర్ ప్లాన్ అమలుపై స్టే ఇవ్వాలని కోరగా కోర్టు నిరాకరించింది. మరో పక్క కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతులు నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. ఆందోళనలో భాగంగా రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు మున్సిపల్ కౌన్సిలర్ లకు వినతి పత్రాల అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లకు వినతి పత్రాలు అందించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ లో రైతులకు అనుకూలంగా తీర్మానం చేయాలని రాజకీయ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్ లకు వినతి పత్రాలను అందించారు.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ ధరల పెంపునకు ఏపి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ..ట్విస్ట్ ఏమిటంటే..