భారత ప్రధాని నరేంద్రమోదీకి నటుడు, రాజకీయ నాయకుడు కమల్హాసన్ బ్యానర్ల సంస్కృతికి స్వస్తి పలకాలంటూ ట్వీట్ చేశారు. ఇటీవల రోడ్డు పక్కన ఏర్పాటు చేసి బ్యానర్ పడి శుభశ్రీ అనే అమ్మాయి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలీవుడ్ సినీ హీరోలు కమల్, విజయ్, సూర్య తమ అభిమానులకు బ్యానర్లను ఏర్పాటు చేయవద్దని తమ అభిమానులను కోరారు. అయితే ఈ నెలలో చైనా ప్రధాని జిన్పింగ్తో మోదీ సమావేశం కానున్నారు. కాబట్టి బ్యానర్లకి అనుమతి ఇవ్వండంటూ తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకి వెళ్లింది. ఈ పరిణామంపై కమల్ మోదీకి ట్వీట్ చేశారు.
“మోదీ సర్..శుభశ్రీ మరణంతో తమిళ ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. మీ బ్యానర్లను ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకి వెళ్లింది. ఈ బ్యానర్ల సంస్కృతికి స్వస్తి పలకండి. ఇలా చేస్తే మీరు తమిళ ప్రజల అభిప్రాయాలను గౌరవించినవారవుతారు. జై హింద్“ అని తెలిపారు కమల్.