(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దిగ్గజ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా యువతలో స్ఫూర్తిని నింపేలా క్రియేటివిటీతో చేసే పనులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మట్టినే క్యారమ్ బోర్డులా చేసి ఆట ఆడుతున్న చిన్నారుల ఫొటోను ఆయన షేర్ చేశారు. వాళ్ల క్రియేటివీటికి ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా.. వారిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. వారి తెలివికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
What an inspiring photo to see in my #whatsappwonderbox this morning. Incontestable evidence that India has zero poverty of imagination… pic.twitter.com/WYYu1ohX84
— anand mahindra (@anandmahindra) October 11, 2019
కొంత మంది చిన్నారులు మట్టిని చదును చేసి అచ్చం క్యారమ్ బోర్డును తలపించేలా తయారు చేశారు. క్యారంబోర్డుకి ఉన్నట్లే నాలుగువైపులా హోల్స్ పెట్టి బాటిల్స్ మూతలతో ఆట ఆడుకుంటున్నారు. భారతదేశానికి పేదరికం ఉందని చెప్పలేని సాక్ష్యం అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మొత్తానికి ఆలోచన ఉంటే ఏది సాధ్యంకాకుండా పోదని ఈ చిన్నారులు మరోసారి నిరూపించారు. ఆనంద్ మహీంద్రా ఈ ఫొటోను షేర్ చేసిన కొద్ది సేపటికే వేల సంఖ్యలో లైక్ లు, కామెంట్లు వచ్చాయి.