న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సుప్రీంకోర్టు విధించిన గడువు కన్నా ఒక్క రోజు ముందు స్వీడిష్ టెలికాం కంపెనీ ఎరిక్సన్కు 458 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించి జైలు తప్పించుకున్నారు. ఎరిక్సన్కు చెల్లించాల్సిన బకాయిలు నాలుగు వారాల్లో చెల్లించకపోతే మూడు నెలలు జైలులో గడపాల్సివస్తుందని గత నెలలో సుప్రీంకోర్టు రిలయెన్స్ కమ్యునికేషన్స్ అధినేత అనిల్ అంబానీని, మరో ఇద్దరు డైరక్టర్లను హెచ్చరించింది.
రిలయెన్స్ కమ్యునికేషన్స్ నెట్వర్క్ను ఏడేళ్ల పాటు నిర్వహించేందుకు 2014లో ఎరిక్సన్ ఒప్పందం కుదుర్చుకుంది. దాని సంబంధించిన బకాయిల కోసం ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయిచింది. తమ ఆస్థులు రిలయెన్స్ జియోకు అమ్మకానికి పెట్టామనీ, ఆ ప్రక్రియ కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో నిధులు లేకుండా పోయాయనీ అనిల్ అంబానీ కోర్టుకు చెప్పారు. రఫేల్ జెట్ విమానాల ఒప్పందంలో పెట్టుబడులు పెట్టగలరు గానీ తమ బకాయిలకు మాత్రం నిధులు లేవంటున్నారనీ ఎరిక్సన్ వాదించింది. చివరకు కోర్టు ఆదేశాల మేరకు అనిల్ అంబానీ బకాయిలు చెల్లించి బయటపడ్డారు.