అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆర్పి ఠాగూర్కు కలవాలని పిలుపు వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు మేరకు గురువారం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ కానున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఇసి నుండి డిజిపికి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే డిజిపిని ఎన్నికల విదుల నుండి తప్పించాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం తెలిసిందే. గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో మరో మారు కూడా వైసిపి నేతలు డిజిపిని బదిలీ చేయాలంటూ లేఖ రాసారు. వైసిపి ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్ డిజి ఎబి వెంకటేశ్వరరావు, కడప ఎస్పి రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పి వెంకటరత్నంలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.