NewsOrbit
టాప్ స్టోరీస్

ఎవరి సర్వే నమ్మాలి ?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ను వివిధ సర్వే సంస్థలు కొద్దిసేపటి క్రితమే ప్రకటించాయి. అయితే.. ఈ సర్వేల తీరు చూస్తుంటే.. ప్రజల్లో తీవ్ర గందరగోళం, అయోమయం కలుగుతున్నాయనే చెప్పాలి. కొన్ని సంస్థల సర్వేలు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి మెజారిటీ వస్తున్నట్లు తేల్చాయి. మరి కొన్ని సర్వేలు మాత్రం చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీకే ఆంధ్రా ఓటర్లు మరోసారి పట్టం కట్టబోతున్నారని తెలుస్తోంది. ఇక జనసేన పార్టీకి ఏ సర్వేలో అయినా మూడో స్థానమే దక్కడం గమనార్హం. ఐఎన్ఎన్ఎన్ సర్వేలో అయిదు సీట్లు, వీడీపీ అసోసియేట్స్ సర్వేలో నాలుగు స్థానాల వరకూ మాత్రమే రావొచ్చని తేల్చాయి. ఏపీని విభజించిన కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకుని ఐదేళ్ళూ కాలక్షేపం చేసిన బీజేపీకైతే ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం ఏ సర్వేలోనూ లేకపోవడం విశేషం.

నిజానికి ఎగ్జిట్‌పోల్స్ చూస్తుంటే.. ఏ సర్వేని విశ్వసించాలో తెలియక ఆంధ్రప్రదేశ్ ప్రజలు గందరగోళంలో పడిపోయారనే చెప్పాలి. సర్వేలు చేస్తూ.. ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు పడిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే, ఐఎన్ఎన్ఎన్ సర్వేలు తప్ప మిగతావన్నీ వైసిపీయే అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించాయి. అయితే.. రాజకీయాల్లో మార్పు నినాదంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల బరిలో దిగిన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి మాత్రం అన్ని ఎగ్జిట్‌పోల్స్‌లోనూ మూడో స్థానమే రావడం గమనార్హం.

లగడపాటి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పది స్థానాలు అటూ ఇటూగా 90 నుంచి 110 సీట్లు రావచ్చు. ఇక వైసిపీకి ఆయన సర్వేలో కొన్ని సీట్లు అటూ ఇటూగా 65 నుంచి 79 స్థానాలు రావచ్చని తేలింది. ఇండియా టు డే సర్వే ప్రకారం టీడీపీకి కేవలం 37నుంచి 40 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వస్తున్నాయట. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైసిపికి ఇండియా టు డే సర్వేలో 130 నుంచి 135 అసెంబ్లీ సీట్లు వస్తున్నాయి. జనసేనకైతే ఒక్క స్థానం వచ్చే అవకాశాలున్నట్లు చెబుతోంది. మరో సర్వే సంస్థ ఐఎన్ఎన్ఎన్ సర్వేలో టీడీపీకి 118 స్థానాలు, వైసిపీకి 52 సీట్లు వస్తాయని, జనసేన పార్టీకి అయిదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. సీపీఎన్ సర్వేలో వైఎస్సార్సీపీకి 130 నుంచి 133 సీట్లు, టీడీపీకి 43 లేదా 44 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. ఈ సర్వే కూడా జనసేనకు ఒక్క స్థానం దక్కే వీలుందని తెలిపింది. వీడీపీ అసోసియేట్స్ సంస్థ సర్వేలో కూడా వైఎస్సార్సీపీయే 111 నుంచి 121 అసెంబ్లీ స్థానాల్లో విజయ ఢంకా మోగించి అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లు స్పష్టం చేసింది. చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి అయితే.. కేవలం 54 నుంచి 60 సీట్లు దక్కే అవకాశం ఉందంటూ చెప్పింది. ఇక జనసేన పార్టీకీ నాలుగు స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ఏతా వాతా తేలుతోందేంటంటే.. ఈ ఎగ్జిట్‌పోల్స్‌లో ఏ సర్వే సంస్థ ఓటర్ల పల్స్ సరిగ్గా పసిగట్టగలిగిందనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ సర్వేల ఫలితాలు ఎలా ఉన్నా.. ఈ నెల 23న సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడతాయి. ఆ రోజుతో ఎవరు రాజో, ఎవరు మంత్రో స్పష్టం కానుంది.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment