అసలు చైనా రహస్యం ఏంటి? ప్రపంచానికి కరోనాని అంటించి ఇప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంది? కరోనాని పరిచయం చేసిన వూహన్ నగరం ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. ప్రపంచమంతా వణుకుతుంటే వూహన్ మాత్రం మామూలు నగరంగా మారిపోయింది. చైనా కరోనాని గెలిచిందా? కరోనా మాటున వాస్తవాలను దాచిందా? బ్రహ్మాండమైన వైద్య సదుపాయాలూ, లాక్ డౌన్ ప్రయత్నాలు ఫలించి చైనా కరోనాని గెలిచేసిందా? లేదా లక్షల మరణాలను దాచేసిందా? ఒక వేళ చైనా కరోనాని జయిస్తే మాత్రం ఆ సూత్రాన్ని ప్రపంచం ఆచరించాల్సిందే. అదే ఇప్పుడు ప్రపంచానికి దిక్కు. ఏమో మనమూ పాజిటివ్ గా చైనా జయించిందనే పాయింటునే ఇక్కడ తీసుకుందాం. అదే చెప్పుకుందాం.
అయిదు నెలల్లో కట్టడి…!
చైనాలో నవంబరులో మొదటి కేసు కనిపించింది. డిసెంబరులో దానికి కరోనా అని పేరు పెట్టారు. జనవరి నాటికీ ప్రపంచ దేశాలకు విస్తరించింది. మర్చి నాటికీ ఉధృతి పెంచింది. మార్చిలో ప్రపంచం అల్లాడుతున్న సమయానికి చైనా చల్లబడింది. పోనీ ఈ సమయంలో కూడా బీభత్సమైన ఉధృతి లేదు. మరణాలు స్వల్పమే, కేసులు లక్ష లోపే కట్టడి చేసేసింది. అమెరికా, ఇటలీ, బ్రిటన్స్పె, యిన్, ఫ్రాన్స్, జెర్మనీ వంటి దేశాలలో చైనా కంటే ఆలస్యంగా కరోనా వచ్చింది. కానీ రెండు నెలల వ్యవధిలోనే విజృంభించింది. మరణాలు ఆగడం లేదు, లక్షల్లో కేసులు, వేళల్లో మరణాలు ఆ దేశాలను వణికిస్తున్నాయి. అందుకే చైనా కట్టడి సూత్రాలు ఇప్పుడు అవసరమయ్యాయి. గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు పది మంది చైనాలోని వూహాన్ వెళ్లి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయారు. రోగులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, ప్రభుత్వం కూడా ధీమాగా ఉంది. మొత్తానికి చైనా ద్వారా లోకాన్ని వణికిస్తున్న కరోనాని చైనా మాత్రం జయించింది.
భలే అప్రమత్తత…!
నవంబరులో మొదటి కేసు సోకింది. మొదటి పది రోజులు పెద్దగా పట్టించుకోలేదు. డిసెంబర్ నాటికీ వంద కేసులకు చేరింది. అప్పుడు భయం మొదలయ్యింది. డిసెంబర్ మూడో వారానికి ఉధృతి పెరిగింది. పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేసింది.
జనవరి రెండో వారానికి 10 వేల కేసులకు చేరింది. ఇక లాభం లేదనుకుని చైనా దేశంలో 80 శాతం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. వూహన్ సిటీలో పది రోజుల్లోనే పది వేల పడకల ఆసుపత్రి నిర్మించేసింది. వైద్యులను దించేసింది. రోగులకు ప్రత్యేక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసింది. నలుదిశలా కట్టడి చేస్తూ సాధ్యమైనంత ఆర్ధిక ప్రయోజనాలు కల్పించింది. 2 వేల పొలిసు బృందాలను దించి రోగులను గుర్తించి దాదాపు ఆరు కోట్ల మందిని క్వరెంటైన్ చేసింది. అలా అలా మర్చి మూడో వారానికి కట్టడి చేసుకుంది. మరణాల రేటు కేవలం 5 శాతమే. వైరస్ సోకడం తగ్గింది. 150 కోట్ల జనాభా ఉన్న దేశాన కేవలం 81 వేల రోగులతో, 3330 మరణాలతో చైనా కరోనాని ఒక రకంగా జయించినట్టే. అందుకే ఏప్రిల్ మొదటి వారానికి పూర్తిగా తేరుకుని సాధారణ చైనా గా మారింది. నిన్ననే వూహన్ లో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసారు. ఇప్పుడు చైనాలో రోజుకి వంద మంత్రమే కొత్త కేసులు వస్తున్నాయి, కేవలం ఒకరో, ఇద్దరో మాత్రమే మరణిస్తున్నారు. ఇక్కడ గుర్తించాల్సింది… ఎక్కువ కాలంలో రోగంతో పోరాడిన చైనా తక్కువ మరణాలతో బయటపడింది.
నాణేనికి మరోవైపు ఉంది…!
అది ప్రపంచానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థలకు తెలిసిన నిజం. చైనా వెల్లడిస్తున్న వాస్తవం. కానీ ఇక్కడ మరో కోణం కూడా ఉంది. చైనా మరణాలను దాచేసింది. కోటినారా మందికి పైగా మరణించినా చైనా ప్రపంచానికి నిజాలు వెల్లడించలేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరేలా చైనాలోని టాప్ 3 మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లకు ఇప్పుడు కోటిన్నర మంది యూజర్లు తగ్గారట, వారు ఎక్కడున్నారో తెలియట్లేదట. వారి నంబర్లు పని చేయడం లేదట. అందుకే వారందరూ కరోనాతో మరణించారని పైకి కొన్ని పుకార్లు వస్తున్నాయి. ఏమో దీనిలో ఏమా మాత్రం వాస్తవమో ధృవీకరించలేం, ఈ లెక్కలన్నీ WHO మాత్రమే తేల్చాలి. ఏది ఏమైనా చైనా లోని పాజిటివ్ కోణాన్ని తీసుకుంటే, కట్టడి చేసిన తీరుని మాత్రమే తీసుకుంటే మాత్రం అమెరికా సహా ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, జెర్మనీ వంటి దేశాలు పాఠాలు నేర్చుకోవచ్చు.