హైదరాబాదు, ఏప్రిల్ 30 : టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు సవాల్ విసిరిన ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి హనుమంతరావు పెద్దమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ సంస్థ గ్లోబరీనా ఐటి కంపెనీ తనకు తెలియదని ఐటి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కెటిఆర్ చెప్పడం అబ్బద్దమని వి హనుమంతరావు విమర్శించారు. గ్లోబరీనా కంపెనీ తెలియదని అమ్మవారి మీద ప్రమాణం చేస్తావా అని వి హనుమంతరావు సవాల్ విసిరారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు కెటిఆర్ పెద్దమ్మ గుడి వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. అమ్మవారి గుడి వద్దకు కెటిఆర్ రాకపోతే ఆయనకు ఆ ఐటి కంపెనీతో సంబంధం ఉన్న మాట నిజమని వి హనుమంతరావు అన్నారు. సవాల్ మేరకు వి హనుమంతరావు పెద్దమ్మ గుడి వద్దకు చేరుకున్నారు.
ఇంటర్ ఫలితాల అవకతవకల కారణంగా 20మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అఖిలపక్షాలు, విద్యార్థి సంఘాల ఉద్యమాలతో తెలంగాణ రాజధాని అట్టుడికిపోతోంది.
అఖిలపక్షం పిలుపు మేరకు సోమవారం ఇంటర్ బోర్డు ముట్టడికి కార్యక్రమం నిర్వహించగా నాంపల్లి రోడ్డు రణరంగంగా మారింది. వివిధ పార్టీల నాయకులను ముందస్తు అరెస్టులు చేయడంతో పాటు ఇంటర్ బోర్డు వద్దకు చేరుకున్న నాయకులు, విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ, విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలనీ, బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలనీ, బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ పార్టీ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహర దీక్ష చేపట్టగా ఆయన దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు.
ఇంటర్ పలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఇంటర్ బోర్డు, గ్లోబరీనా సంస్థ తప్పిదాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదక ఇచ్చినా ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదు.
వి హనుమంతరావు సవాల్ను కెటిఆర్ స్వీకరిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది.