న్యూఢిల్లీః దేశరాజధాని ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు మారనుంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ స్మారకార్థం ఆయన పేరును స్టేడియానికి పెట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ప్రకటించింది. స్టేడియానికి జైట్లీ పేరు పెట్టే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 12న నిర్వహించనున్నారు. కోట్లా స్టేడియంలో ఓ స్టాండ్కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు డీడీసీఏ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 1999 నుంచి 2013 వరకు జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. క్రికెట్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో కృషి చేశారు. కోట్లా స్టేడియంలో మౌలిక సదుపాయాలు, స్టాండ్ల నిర్మాణం, ఆధునికీకరణ వంటివి జైట్లీ ఆధ్వర్యంలోనే జరిగాయి.
News Alert: Kotla to be renamed as Arun Jaitley Stadium.
The renaming of Delhi's famous cricket venue as Arun Jaitley Stadium will take place on September 12 at a function where a Stand of the ground will be named after India captain Virat Kohli.— DDCA (@delhi_cricket) August 27, 2019
విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, రిషభ్ పంత్ లాంటి క్రికెటర్లు దేశం గర్వించేలా చేశారంటే అది అరుణ్ జైట్లీ అందించిన మద్దతు, ప్రోత్సాహం వల్లేనని డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ అన్నారు. ఇదిఇలా ఉంటే.. ఢిల్లీలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్కు అరుణ్ జైట్లీ పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. ఈ మేరకు ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్కు లేఖ రాశారు. అనారోగ్యంతో అరుణ్ జైట్లీ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
May he remain in our hearts forever. As a mark of respect to our beloved leader, I hereby propose to rename “Yamuna Sports Complex” as “Arun Jaitley Sports Complex” #RiPJaitleySir pic.twitter.com/ooK95RZHiQ
— Gautam Gambhir (@GautamGambhir) August 26, 2019