(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలను తప్పుగా అర్ధం చేసుకోవద్దని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. మోదీ ఆ మాటలు అన్నది ట్రంప్ అభ్యర్ధిత్వాన్ని బలపరచడం కోసం కాదనీ, ఆయన ఏ సందర్భంలో అలా అన్నారో పరిశీలించాలనీ జైశంకర్ అన్నారు. వాషింగ్టన్లో విదేశాంగ మంత్రి మీడియాతో మాట్లాడుతున్నపుడు ఈ ప్రస్తావన వచ్చింది.
గత వారం మోదీ అమెరికా వచ్చినపుడు హూస్టన్లో జరిగిన భారీ ఈవెంట్ హౌడీ మోదీలో ట్రంప్ కూడా పాల్గొన్నారు. అక్కడ చేరిన 50 వేల మంది ప్రవాస భారతీయులకు ట్రంప్ను పరిచయం చేస్తూ, ఫ్రెండ్స్, ఇండియాలో మనం అధ్యక్షుడు ట్రంప్తో బాగా కనెక్ట్ అయ్యాం..అభ్యర్ది ట్రంప్ అన్న మాటలతో. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అన్న మాటలు ప్రతిధ్వనించాయి అని మోదీ అన్నారు.
ఈ మాటలను మోదీ ట్రంప్ అభ్యర్ధిత్వాన్ని బలపరచడం కింద చూడకూడదని జైశంకర్ అంటారు. విదేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం భారతదేశం దౌత్యనీతిగా మొదటి నుంచీ స్థిరపడిపోయింది. దానికి భిన్నంగా మోదీ ట్రంప్ అభ్యర్ధిత్వాన్ని బలపరచారంటూ కాంగ్రెస్తో సహా చాలామంది విమర్శించారు. అలా భావించడం తప్పనీ, మోదీ ఆ మాటలన్నది గతం గురించేననీ జైశంకర్ పేర్కొన్నారు.
జైశంకర్ సమర్ధింపు తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో మోదీపై విమర్శ చేశారు. ట్రంప్ను మోదీ సమర్ధించడం వల్ల ఇండియా అనుకూల డెమోక్రాట్లకు సంబంధించి సమస్యలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.