హైదరాబాద్, మార్చి 19: మహబూబ్ నగర్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజి మంత్రి డికె అరుణ కూడా కాంగ్రెస్ పార్టికి షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టికి గుడ్ బై చెప్పి అధికార పార్టిలో చేరుతుండటం ఆ పార్టని తీవ్ర కలకలానికి గురి చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ పార్టి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పొయే పరిస్థితి ప్రమాదం నెలకొంది.
ఇటీవలే మాజీ మంత్రి, మల్లేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కారెక్కుతున్నట్లు (టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు) ప్రకటించారు. ఆమె పార్టి వీడకుండా ఉండేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో పాటు స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రయత్నం చేసారని వార్తలు వచ్చాయి. అయినా అమె నిర్ణయాన్ని మార్చుకోలేదు.
ఈ నేపధ్యంలోనే సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డికె అరుణ కూడా పార్టిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె వారందరికీ భిన్నంగా రాష్ట్రంలో అధికార పార్టిని కాకుండా జాతీయ పార్టి బిజెపిలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
బిజెపి సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ మంగళవారం డికె అరుణతో భేటి అయినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో డికె అరుణ లాంటి సీనియర్ నాయకురాలు పార్టీ వీడితే ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టికి తీరని నష్టమేనని భావిస్తన్నారు.
ఒకటి రెండు రోజులలో డికె అరుణ తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.