అమరావతి, మార్చి 11: సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభం అయ్యింది. 18రాష్ట్రాల్లో 91పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ లో 25లోక్సభ, 175అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాాల వద్ద బారులు తీరారు.
పలు పోలింగ్ కేంద్రాలలో మాక్ పోలింగ్ సమయంలోనే ఇవిఎంలు సాంకేతిక లోపంతో పనిచేయలేదు. ఇవిఎంలు మొరాయించడం వల్ల ఉదయం 8. 30గంటల వరకూ పోలింగ్ ప్రారంభం కాలేదు.
పని చేయని ఇవిఎంల స్థానంలో స్టాండ్ బైగా ఉన్న ఇవిఎంలతో పోలింగ్ జరిపేందుకు ఎన్నికల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ జరిగేందుకు ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఓటు హక్కు వినియోగించుకున్న వివిధ రాజకీయ పార్టీల నేతలు…