(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారత్ విధించిన టారిఫ్లు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదనీ, వాటిని కచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ జె ట్రంప్ పేర్కొన్నారు.
భారత్కు జిఎస్పి హోదాను తొలగించడానికి ప్రతిగా భారత్ ఇటీవల 28 రకాల ఆమెరికా వస్తువులపై సుంకాలను పెంచింది. వీటిలో బాదం, ఆపిల్, పప్పు దినుసులు, వాల్నట్ వంటివి ఉన్నాయి. ట్రంప్కు ఆమెరికాలో బలమైన మద్దతుదారులైన గ్రామీణులపై దీని ప్రభావం తీవ్రంగా పడుతోంది. 2020 ఎన్నికల నేపథ్యంలో ట్రంప్కు ఇది సమస్యగా మారనుండటంతో దీనిపై స్పందించారు. శుక్రవారం జపాన్లో జరిగే జి 20 సదస్సు సందర్భంగా మోదీతో భేటీ కానున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
‘భారత్ కొన్నేళ్లుగా అమెరికా వస్తువులపై భారీగా సుంకాలను విధిస్తున్న విషయంపై నేను ప్రధాని నరేంద్ర మోదితో చర్చించబోతున్నాను. దీనికి తోడు ఇప్పుడు మళ్లీ సుంకాలను పెంచింది. దీనిని మేము ఏ మాత్రం అమోదించబోము. వీటిని కచ్చితంగా వెనక్కు తీసుకోవాల్సిందే’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.
https://twitter.com/realDonaldTrump/status/1144089743795216384