నైరుతి రుుతుపవనాల ప్రస్తుత స్థితిని తెలిపే మ్యాప్. ( Map Courtesy: Indian Meteorological Department)
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు జూన్ ఆరున ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ ఒకటిన రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఈసారి కాస్త ఆలస్యంగా ప్రవేశిస్తున్నాయి.
ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం దక్షిణ భాగం, కొంత బంగాళాఖాతం., కొంత అండమాన్ సముద్రం ప్రాంతాలను దాటాయి. వచ్చే రెండుమూడు రోజుల్లో అరేబియా సముద్ర ప్రాంతం మొత్తం దాటుతాయి అని వాతావరణ శాఖ అధికారి ఎమ్. మహాపాత్రా ఎఎన్ఐ వార్తాసంస్థకు చెప్పారు.
ఈ సంవత్సంరం సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది దీర్ఘకాల సగటులో 96 శాతం వర్షపాతం ఉంటుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలో 70 శాతం వర్షపాతం రుతుపవనాల సీజన్లోనే అందుతుంది. ఈ వేసవిలో అసాధారణమైన ఉష్ణోగ్రతలతో భరించలేని వేడిని ఎదుర్కొంటున్న ప్రజలు రుతుపవనాల రాక కోసం ఎదురుచూస్తున్నారు.