అనంతరం, మార్చి 13: అనంతరం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన కుమారుడికే టిడిపి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని మంత్రి పరిటాల సునీత పట్టుబడుతున్నారు. ఈ మేరకు గురువారం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ కుటుంబ నిర్ణయాన్ని వెల్లడిస్తామని బుధవారం మీడియాకు తెలిపారు.
పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పరిటాల శ్రీరామ్ పోటీ చేయాలని పట్టుబడుతున్నారని సునీత అన్నారు. తనతో పాటు తన కుమారుడికి అభ్యర్థిత్వాలు ఖరారు చేయాలని కోరుతున్నామనీ, ఒక వేళ రెండు టికెట్లు ఇవ్వడానికి వీలుకాకపోతే తన కుమారుడికే రాప్తాడు కేటాయించాలని కోరుతున్నానని సునీత చెప్పారు.
పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తామని సునీత తెలిపారు.
ఇప్పటికే రాప్తాడు అసెంబ్లీ టికెట్ను పరిటాల సునీతకు పార్టీ అధినేత ఖరారు చేశారు.
బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలోనూ అభ్యర్థి శ్రీరామ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సునీత ప్రజలను కోరారు.
పోటీ విషయంపై పరిటాల శ్రీరామ్ తన తల్లి నిర్ణయమే శిరోధార్యమని వెల్లడించారు.