పట్నా: భారీ వర్షాలతో అతలాకూలతమైన బిహార్ లో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వరద నీటిలో చిక్కుకున్న ఓ రిక్షావాలాకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వరణుడి ప్రతాపానికి బిహార్ వణికిపోయింది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తి రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రవాణా వ్యవస్థ స్తంభించింది. పలు ప్రాంతాల్లో వందలాది ఇళ్లు నీట మునిగాయి. వరద నీటిలో ఓ వ్యక్తి తన రిక్షాతో చిక్కుకున్నాడు. నడుము లోతు వరద నీటి చిక్కుకున్న అతను సహాయం కోసం అర్ధించాడు. అయితే, రిక్షాను వదిలి వెళ్లమని స్థానికులు చెప్పినా..సదరు వ్యక్తి వినలేదు. తన జీవనోపాధి అయిన రిక్షాని వదిలి వెళ్లలేనని చెప్పాడు.
All that development talk sounds rubbish when you see stuff like this #patna pic.twitter.com/jhLdobRnlr
— Gabbbar (@GabbbarSingh) September 29, 2019
ఈ హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు పట్నాలో వరద నీటిలో చిక్కుకున్న వీధుల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. దీంతో ప్రజలు ట్విట్టర్ వేదికగా పలు వీడియోలను పోస్టు చేస్తున్నారు. పట్నాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వరదల్లో ఇప్పటివరకు 40 మంది మృతి చెందగా..9 మందికి గాయాలైనట్లు బీహార్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. కుండపోత వర్షాలతో వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఐఏఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.